Webdunia - Bharat's app for daily news and videos

Install App

తీపి మధురం సపోటా.. పోషకాల గని...

Webdunia
గురువారం, 11 మే 2023 (11:39 IST)
సపోటా పండు తీపి మధురం. మామిడి పండు తర్వాత అత్యధికంగా పోషకాలుండే పండు. అలాంటి సపోటా పండ్లను ఆరగించడం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో ఓసారి తెలుసుకుందాం. 
 
వంద గ్రాముల సపోటా ముక్కల తింటే అందులో 83 కేలరీల శక్తి ఉంటుంది. అందుకే ఇవి తింటే తక్షణ శక్తి వస్తుంది. ముఖ్యంగా గర్భిణులు ఈ పండు తింటే ఆరోగ్యంగా ఉంటారు.
 
విటమిన్-సితో పాటు అధికంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో ఉంటాయి. అందుకే ఇవి మంచి "ఇమ్యూనిటీ బూస్టర్‌గా ఉపయోగపడతాయి. బరువు తగ్గాలనుకునేవాళ్లు ఈ సపోటాను మెనూలో క్రమం తప్పకుండా చేర్చుకోవచ్చు. వీటిలో కాల్షియం, పొటాషియంలు పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల ఎముకలు గట్టిపడతాయి.
 
మాంగనీసుతో పాటు పొటాషియం ఉండటం వల్ల రక్తపోటును అదుపులో ఉంటుంది. తద్వారా గుండె ఆరోగ్యానికి ఎంతో మంచిది. కంటి చూపు మెరుగవు తుంది. ఫోలేట్, నియాసిన్, పాంథోయినిక్ ఆమ్లాల వల్ల జీవక్రియ మెరుగవుతుంది.
 
సపోటా గుజ్జును ముఖంపై రుద్దితే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. వీటి విత్తనాలతో చేసిన నూనెతో మర్జనం చేసుకుంటే నొప్పులు తగ్గిపోతాయి. చర్మానికే కాదు జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తుంది సపోటా. పిండిపదార్థం అధికంగా ఉండే ఈ పండు సులువుగా జీర్ణమవుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

రీల్స్ కోసం యమునా నది ఒడ్డున బాలికలు నీటితో చెలగాటం: మునిగిపోయి ఆరుగురు మృతి

పేద విద్యార్ధిని చదువుకు సాయిదత్త పీఠం చేయూత

వైసిపి వెన్నుపోటు దినం: బొత్సకు ఏమైంది? ఎందుకలా పడిపోయారు (video)

Wajahat Khan: శర్మిష్ట అరెస్టుకు కారణమైన వ్యక్తి.. ఎక్కడ? ఎఫ్ఐఆర్ నమోదు

రాజోలిలో ఇథనాల్ చిచ్చు... తిరగబడిన రైతుబిడ్డ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

తర్వాతి కథనం
Show comments