Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేరేడు పండ్ల సీజన్... నేరేడుతో ఏమేమి తగ్గుతాయో తెలుసా...?

నగరంలో ఉండేవారికి నేరేడు పళ్ల గురించి అంతగా తెలియదు. కొన్నిచోట్ల దీనిని కాలాజామూన్‌గా వ్యవహరిస్తుంటారు. చూడటానికి వంగపండు రంగులో మిలమిల మెరిసిపోతూ వుంటాయి. తినే విషయానికి వచ్చేసరికి చాలామంది వెనకడుగువేస్తుంటారు. ఒక్క నేరేడు పండు తినగానే నోరంతా అదో మా

Webdunia
బుధవారం, 22 జూన్ 2016 (16:15 IST)
నగరంలో ఉండేవారికి నేరేడు పళ్ల గురించి అంతగా తెలియదు. కొన్నిచోట్ల దీనిని కాలాజామూన్‌గా వ్యవహరిస్తుంటారు. చూడటానికి వంగపండు రంగులో మిలమిల మెరిసిపోతూ వుంటాయి. తినే విషయానికి వచ్చేసరికి చాలామంది వెనకడుగువేస్తుంటారు. ఒక్క నేరేడు పండు తినగానే నోరంతా అదో మాదిరిగా కొట్టుకుపోయినట్లు ఉండి... వగరు వగరుగా ఉండటంతో చిన్నపిల్లలు అస్సలే దగ్గరికి రానీయరు. కానీ నేరేడును ఆయుర్వేద శాస్త్రంలో అపర సంజీవిని అంటారు. జీర్ణ సంబంధిత రోగాలకు నేరేడు దివ్యౌషధం. నేరేడు పండ్లను గింజలతో సహా జ్యూస్‌ చేసుకుని సేవిస్తే కడుపులో నులిపురుగులు వెంటనే చనిపోతాయి.
 
జీర్ణశక్తిని అమాంతం పెంచేస్తుంది ఈ నేరేడు జ్యూస్‌. తరచుగా కడుపునొప్పితో బాధపడేవారికి ఈ జ్యూస్‌ వారం రోజులపాటు సేవిస్తే మంచి ఫలితం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. దీర్ఘకాలంగా శ్వాససంబంధిత రోగాలలో బాధపడేవారికి నేరేడు పళ్లు తరచుగా తింటుంటే రోగనిరోధకశక్తి పెరిగి శ్వాససంబంధ రోగాలు దూరం అవుతాయి. చిన్నపిల్లలకు నేరేడు లాభాలను గురించి చెప్పాలి. వగరుగా ఉండటమే దాని ప్రత్యేకత అని దానిని తీసుకుంటే ఎటువంటి రోగాలు దరిచేరవని వారికి అర్థం అయ్యేరీతిలో చెబుతుండాలి.
 
విషాన్ని హరించే శక్తి...
అడవి ప్రాంతాలలో ఈ నేరేడు పండ్లు విరగగాసేవి. మొదట్లో వీటిని పిచ్చికాయలుగా భావించి జనం తీసుకునేవారు కాదట. అయితే ఇందులో ఎంతో ఔషధ గుణాలున్నాయని తెలుసుకుని, అపర సంజీవనిలా ఇది పనిచేస్తుందని ఆయుర్వేద వైద్యులు దీనిపై పరిశోధనలు మొదలుపెట్టారు. అప్పటి నుంచి జనం వీటిని మందులాగా వాడుతున్నారు. పూర్వకాలంలో ఏదైనా విష పురుగులు శరీరంలో ఎక్కడైనా కుట్టినట్లయితే... వెంటనే నేరేడు ఆకులను ఆ ప్రాంతంలో వేసి కట్టుకట్టేవారు. శరీరంలో ప్రవేశించిన విషం ప్రభావం మెల్లిగా నేరేడు ఆకులకు చేరి తెల్లవారేసరికి రోగి లేచి కూర్చునేవాడట. అంటే మన శరీరంలో విషాన్ని కూడా పీల్చేసే శక్తివంతమైన ఆకులు కలిగివున్న నేరేడు చెట్టు... తన కాయల ద్వారా కూడా ఎందరికో ఆరోగ్యాన్ని ప్రసాదించడం విశేషం. 
 
గింజల్లోనూ విశేషమే...
నేరేడు గింజల్లో జంబోలిన్‌ అనే గ్లూకోసైట్‌ పదార్థం ఉంది. ఇది మన శరీరంలో ఉండే స్టార్చ్‌ను చక్కెరగా మారుస్తుంది. అది ఉత్పత్తి చేసే చక్కెర షుగర్‌ వ్యాధిగ్రస్తులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒక రకంగా మన శరీరానికి కావలసిన ఇన్సులిన్‌ను ప్రకృతిసిద్ధంగా ఇది మనకు అందిస్తోంది. 
 
అప్పుడప్పుడు మనం మనకు తెలియకుండానే వెంట్రుకలు మన కడుపులోకి పంపించేస్తుంటాం. అయితే ఆ వెంట్రుకలు కడుపులో చుట్టుకుపోయి అప్పుడప్పుడు ఇబ్బందిని కలిగిస్తుంటాయి. నేరేడు పండ్లు ఆ వెంట్రుకలను బయటకు పంపించేస్తాయట. అందుకే నేరేడు పండ్లు విరివిగా దొరికే సీజల్‌లో అయినా నేరేడు పండ్లను తినాలి. సంవత్సరానికి ఒక్కసారైనా నేరేడు పండ్లను తినాలని పెద్దలు చెబుతుంటారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

Praja Rajyam: ప్రజా రాజ్యం, జనసేన పార్టీలను తొలగించిన ఈసీ.. నిజమేనా?

హైటెక్ భారతంలో అంబులెన్స్‌కు కరువాయె ... భార్య మృతదేహాన్ని బైకుకు కట్టి...

డిమాండ్ల పరిష్కారం కోసం షూటింగ్ బంద్ సబబు కాదు : మంత్రి కోమటిరెడ్డి

Telangana Crime: ప్రేమిస్తానని చెప్పాడు.. కానీ పెళ్లికి ముందే వరకట్నం కోసం వేధించాడు... ఆ యువతి?

బాలికను కాల్చి చంపిన ప్రైవేట్ టీచర్ .. ఎక్కడ?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Madhu Shalini : మధు శాలిని ప్రెజెంట్స్ కన్యా కుమారి రిలీజ్ కు సిద్ధం

Nagarjuna : జియో హాట్ స్టార్‌లో బిగ్ బాస్ సీజన్ 9 అగ్నిపరీక్ష

లెక్కలో 150 మంది కార్మికులు, కానీ సెట్లో 50 మందే : చిన్న నిర్మాతల బాధలు

ఆర్మీ కుటుంబాల నేపథ్యంగా మురళీ మోహన్ తో సుప్రీమ్ వారియర్స్ ప్రారంభం

శివుడు అనుగ్రహిస్తే ప్రభాస్ పెళ్లి త్వరలోనే జరుగుతుంది.. : పెద్దమ్మ శ్యామలా దేవి (Video)

తర్వాతి కథనం
Show comments