Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపు మొగల్తూరులో కృష్ణంరాజు సంస్మరణ సభ

Webdunia
బుధవారం, 28 సెప్టెంబరు 2022 (13:53 IST)
కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ సినీ నటుడు కృష్ణంరాజు సంస్మరణ సభ గురువారం ఘనంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం వెస్ట్ గోదావరి జిల్లా మొగల్తూరులో భారీ ఏర్పాట్లు చేశారు. ఈ సంస్మరణ సభ సందర్భంగా సుమారుగా 50 వేల మందికి భోజన ఏర్పాట్లు చేశారు. ఇందులో కృష్ణంరాజు కుటుంబ సభ్యులతో పాటు హీరో ప్రభాస్ కూడా సంస్మరణ సభకు హాజరుకానున్నారు. అంతేకాకుండా, కృష్ణంరాజు సంస్మరణ సభ, సమారాధన కార్యక్రమానికి రావాలంటూ మొగల్తూరులోని ప్రతి ఇంటింటికి సమాచారం పంపించారు. 
 
కాగా, అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన కృష్ణంరాజు ఈ నెల 11వ తేదీన హైదరాబాద్ నగరంలో కన్నుమూసిన విషయం తెల్సిందే. ఆ తర్వాత ఈ నెల 22, 23 తేదీల్లో దశదిన కర్మక్రతువులు హైదరాబాద్ నగరంలోనే పూర్తిచేశారు. అయితే, కృష్ణంరాజు సొంతూరైన మొగల్తూరులో సంస్మరణ సంభ నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో గ్రామంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. 
 
ఈ సంస్మరణ సభ సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీ సంఖ్యలో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ రవి ప్రకాశ్, కలెక్టర్ పి.ప్రశాంతి, సబ్ కలెక్టర్ విష్ణుచరణ్, తదితరులు మంగళవారం సంస్మరణ సభ జరిగే ప్రాంతాన్ని, ఏర్పాట్లను పరిశీలించారు. అలాగే, మొగల్తూరు పాత కాలువ సమీపంలోని మెగాస్టార్ చిరంజీవి నివాసాన్ని కూడా వారు  సందర్శించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకాపా నేత బోరుగడ్డ ఇక జైలుకే పరిమితమా?

Minor girl: 15 ఏళ్ల బాలికపై 35 ఏళ్ల ఆటో డ్రైవర్ అత్యాచారం.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో?

వామ్మో... దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయ్.. ఏపీలోకి ఎంట్రీ ఇచ్చింది..

కొడాలి నాని జంప్ జిలానీనా? లుకౌట్ నోటీసు జారీ!!

Visakhapatnam Covid Case: విశాఖపట్నంలో కొత్త కరోనా వైరస్ కేసు- మహిళకు కరోనా పాజిటివ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments