Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింహాద్రి అప్పన్న లడ్డూ ప్రసాదంలో పురుగులు..! అక్కడే భక్తుల ఆందోళన.. గంటా సీరియస్

Webdunia
శుక్రవారం, 31 జులై 2015 (11:25 IST)
సింహాద్రి అప్పన్న ఆలయంలోని లడ్డూ ప్రసాదంలో బతికిన పురుగులు దర్శనమిచ్చాయి. వీటినే భక్తులకు పంపిణీ చేసిన ఆలయ కమిటీ పురుగుల వ్యవహారాన్ని దాచి పెట్టే ప్రయత్నం చేసింది. అయితే భక్తులు అక్కడే ధర్నా చేయడంతో ఇది కాస్త బహిర్గతమయ్యింది. ఈ సంఘటనపై మంత్రి గంటా శ్రీనివాసరావు సీరియస్ అయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. 
 
విశాఖలో సింహాద్రి అప్పన్న ఆలయంలో గురుపౌర్ణమి సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. గిరి ప్రదర్శన చేసుకుని స్వామిదర్శనం చేసుకున్న తరువాత లడ్డూ కౌంటర్‌లో లడ్డూ ప్రసాదాలను కొనుగోలు చేశారు. ఆ లడ్డూలలో బతికి కదలాడుతున్న పురుగులు, వాటి గుడ్లు, బూజు కనిపించడంతో భక్తులు అవాక్కయ్యారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు.. చాలా మంది భక్తులకు ఇదే పరిస్థితి ఎదురయ్యింది. 
 
ఈ విషయం ఫిర్యాదు చేయడానికి ఆలయ ఈవో వద్దకు వెళ్ళితే ఆయన గుట్టుచప్పుడు కాకుండా వారిని కొండ దింపే ప్రయత్నాలు చేశారు. ఇలా చాలామంది భక్తులకు జరగడంతో అందరూ అక్కడే ధర్నాకు దిగారు. చివరకు విషయం మంత్రి గంటా శ్రీనివాసరావుకు తెలియడంతో ఆయన ఆలయ ఈవోపై సీరియస్ అయ్యారు. అనంతరం నాణ్యత ఉన్న ప్రసాదాలను మాత్రమే పంపిణీ చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. 

EVMను ధ్వంసం చేసిన వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి - video

అమలాపురం మహిళ కడుపులో 570 రాళ్లు.. అవాక్కైన వైద్యులు!!

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి

19-05-2004 నుంచి 25-05-2024 వరకు మీ వార రాశిఫలాలు

అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయా.. మట్టపల్లి నరసింహుడిని దర్శించుకోండి..

18-05-202 శనివారం దినఫలాలు - దంపతుల మధ్య పరస్పర అవగాహన సంతృప్తి...

17-05-2024 శుక్రవారం దినఫలాలు - అభివృద్ధికై చేయు ప్రయత్నాలు నెమ్మదిగా...

రాగి ఆభరణాలు ధరిస్తే.. సూర్య గ్రహ, వాస్తు దోషాలు పరార్

Show comments