Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో నూతన దంపతులకు విఐపి దర్శనం.. తిరుపతిలో వివాహ వేదిక.. టూరిజం యోచన..?

Webdunia
బుధవారం, 22 జులై 2015 (06:48 IST)
ఈ మధ్య కాలంలో తిరుమలలో వివాహం చేసుకునే వారి సంఖ్య పెరుగుతోందనీ వారి కోసం తిరుపతిలో వివాహవేదిక నిర్మించాలని ప్రతిపాదించామని పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ వెల్లడించారు. వివాహం అనంతరం కొత్త దంపతులు, ఇరువైపుల తల్లిదండ్రులు మొత్తం ఆరుగురికి తిరుమలలో వీఐపీ దర్శనం ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలలో పొందుపరుస్తున్నామని వెల్లడించారు.
 
తిరుపతిలో పర్యాటక రంగాన్ని విస్తృత పరచడానికి ప్రణాళికలు రూపొందించినట్టు చెప్పారు. పర్యాటకాభివృద్ధిపై సీఐఐ విశాఖ చాప్టర్‌ మంగళవారం పార్కు హోటల్‌లో నిర్వహిం చిన సదస్సులో ఆయన మాట్లాడుతూ ఎక్కువ మంది వారి పిల్లలకు తిరుపతిలో వివాహం జరి పించాలని కోరుకుంటున్నారని తెలిపారు.  
 
దీని కోసం త్వరలో తిరుపతిలో టూర్‌ ఆపరేటర్లతో సమావేశం నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. పర్యాటక ప్రాజెక్టులు వేగవంతం చేయడంతోపాటు వివిధ వర్గాలను భాగస్వాములను చేస్తామన్నారు. దీనికి ప్రాంతాలవారీగా టూరిజం ప్రమోషన్‌ బ్యూరోలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

13-05-2024 సోమవారం దినఫలాలు - హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమం...

12-05-2024 ఆదివారం దినఫలాలు - మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం...

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

Show comments