శివలింగంలో నీరు ఉన్న ఆలయం ఏది?

Webdunia
సోమవారం, 1 ఏప్రియల్ 2019 (17:19 IST)
శివుని లీలలను ప్రతిబింభించే దేవాలయాలు మన దేశంలో చాలా ఉన్నాయి. వాటిలో ఒకటి నల్గొండ జిల్లాలోని దామరచర్ల మండలం వాడపల్లిలో మీనాక్షీ అగస్తీశ్వరస్వామి ఆలయం. ఈ ఆలయం విశిష్టత ఏమిటంటే.. ఇక్కడడ శివలింగంలో నీరు నిల్వ ఉంటుంది. అలాగని నీరు తీయకుండానే పొంగిపొర్లవు. పూజారి నీళ్లు సేకరించి భక్తులపై చల్లినప్పుడు అదే పరిమాణంలో మళ్లీ నీళ్లు ఊరుతాయి. 
 
కృష్ణా పుష్కరాలకు వేదికైన ఈ విశిష్ట ఆలయానికి ప్రక్కనే కృష్ణా-మూసి సంగమ ప్రదేశం ఉండటం విశేషం. ఈ క్షేత్రానికి స్థల పురాణం ఉంది. కృతయుగంలో అగస్త్యముని ఒక కావడిలో శివుడు, నరసింహస్వామిని పెట్టుకొని పవిత్ర ప్రదేశంలో వారిని ప్రతిష్ఠించాలని పర్యటించారు. ఈ క్రమంలో వాడపల్లికి వచ్చేసరికి అనుకోకుండా ఆ కావడి కింద పెట్టాల్సివస్తుంది. మళ్లీ ఆ కావడిని ఎత్తడానికి ప్రయత్నిస్తే కదలదు. 
 
ఇక్కడే ప్రతిష్ఠించమని ఆకాశవాణి చెప్పడంతో ముని అలాగే చేశాడు. ఆలయం కొలువుదీరాక అగస్తీశ్వర స్వామి ఆలయం సమీపంలోకి ఓ బోయవాడు పక్షిని వేటాడుతూ వస్తాడు. పరమశివుడు ప్రత్యక్షమై దానిని విడిచిపెట్టమని బోయవాడిని కోరుతాడు. బోయవాడు నాకు ఆకలిగా ఉందని అనడంతో పక్షి అంత మాంసం నా తలలో తీసుకోమని శివుడు చెబుతాడు. బోయవాడు శివుడి తలలో పదివేళ్లు పెట్టి మాంసం తీసుకుంటాడు. శివలింగంలో ప్రస్తుతం నీళ్లు ఉంటున్న తరుగు అలాగే ఏర్పడిందని పురాణ ప్రతీతి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Andhra Pradesh: కృష్ణానది నీటిపై ఏపీ హక్కులను ఎట్టి పరిస్థితుల్లో వదులుకునే ప్రశ్నే లేదు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

లేటెస్ట్

వివాహ పంచమి.. అష్టోత్తర శతనామాలతో సీతారాములను పూజిస్తే?

25-11-2025 మంగళవారం ఫలితాలు - ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు...

సుబ్రహ్మణ్య షష్టి: ఓం శరవణభవ నమః

నవంబర్ 25 ధ్వజారోహణ.. రామభూమి అయోధ్యలో 100 టన్నుల పుష్పాలతో అలంకరణ

24-11-2025 సోమవారం ఫలితాలు - గ్రహస్థితి అనుకూలం.. కార్యసిద్ధిస్తుంది...

తర్వాతి కథనం
Show comments