Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల వెంకన్న పాలనలోకి ఒంటిమిట్ట కోదండ రామన్న

Webdunia
బుధవారం, 9 సెప్టెంబరు 2015 (19:19 IST)
సీమ భద్రాద్రి రాముడుగా పేరుమోసిన కోదండ రాముడు తిరుమల వెంకన్న ఏలుబడిలోకి వచ్చేశాడు.  బుధవారం ఉదయం ఆలయాన్ని టీటీడీలో విలీనం చేసే పత్రాలను ఆలయ ఈవో తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తికి అప్పగించారు. ఈ కార్యక్రమం ఒంటిమిట్టలో జరిగింది. ఈ ఆలయం ఖమ్మంలోని భద్రాచల రామాలయం అంతటి పేరు ప్రఖ్యాతలు సాధించడం ఖాయమని ఆయన అన్నారు. 
 
విజయనగర సామ్రాజ్య కట్టడాలకు నిదర్శనమైన 16వ శతాబ్దం నాటి ఈ కోదండ రామాలయం తిరుమల తిరుపతి దేవస్థాన పరిధిలోకి రావడం విశేషమని అన్నారు. బమ్మెర పోతన, తాళ్ళపాక అన్నమాచార్యులు పుట్టిన కడప జిల్లాకు ఇక శోభ సంతరించుకుంటుందని ఆయన అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఆయనతోపాటు టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, డాక్టర్ హరిప్రసాద్‌లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 
 

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

సాధారణ మహిళలా మెట్రోలో నిర్మలా సీతారామన్ జర్నీ.. వీడియో వైరల్

కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఏ- 12 మంది మృతి.. లక్షణాలు

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

13-05-2024 సోమవారం దినఫలాలు - హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమం...

12-05-2024 ఆదివారం దినఫలాలు - మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం...

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

Show comments