గోవిందా.. నీకు రెస్టుందా.... ! తిరుమలలో కైంకర్యాలకు కోత

Webdunia
గురువారం, 18 జూన్ 2015 (09:16 IST)
రద్దీ పెరిగిందో భక్తుల అగచాట్ల సంగతి ఏమో కానీ వేంకటేశ్వర స్వామికి నిద్ర తగ్గిపోతుంది. అందులో అనుమానం లేదు. క్రమేణ పెరుగుతున్న రద్దీ మిసతో ఇంతమందికి దర్శనం చేయించామని చెప్పేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకులు వ్యక్తిగత రికార్డుల కోసం మూలవిరాట్టు పూజా కైంకర్యాల్లో కోత పెడుతున్నారు.  స్వామికి విశ్రాంతి లేకుండా చేస్తున్నారు. ఇది తప్పు వద్దని ఆగమపండితులు పీఠాధిపతులు ఎంత వారిస్తున్నా పట్టించుకునే పరిస్థితులలో అధికారులు పాలకులు లేరు. 
 
గర్భాలయంలో వేంకటేశ్వరస్వామి మూలవిరాట్టు పూజా కైంకర్యాలన్నీ వైఖానస ఆగమ నిబంధనల మేరకు వేకువజాము మొదలుపెడతారు. తిరిగి అర్ధరాత్రి వరకు ప్రాతఃకాల, మధ్యాహ్న, రాత్రి కైంకర్యాలు ప్రతిరోజూ రెండుసార్లు, తోమాల ఒకసారి, మూడుసార్లు అర్చన, నైవేద్యాలు, తగినంత విరామ సమయం కేటాయించాలి. 24 గంటల్లో గర్భాలయ మూలమూర్తికి గరిష్టంగా 10 గంటలు, కనిష్టంగా 6 గంటలకు తక్కువ కాకుండా పూజా కైంకర్యాలు, విరామ సమయం కేటాయించాలి.
 
అయితే, భక్తుల రద్దీ కారణంగా వారందరికీ దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో పూజా నివేదనలతోపాటు విరామ సమయాన్నీ తగ్గిస్తున్నారు. ఎక్కువ మంది భక్తులకు దర్శనం కల్పించామనే తమ వ్యక్తిగత ప్రతిష్ట కోసం ఆగ మ నిబంధనల్ని పక్కదారి పట్టిస్తున్నారన్న విమర్శ లున్నాయి. గత శనివారం అర్ధరాత్రి 12.30 గంటలకు నిర్వహించాల్సిన ఏకాంత సేవ ఆదివారం వేకువజామున 1.45 గంటలకు ప్రారంభించడం, ఆ వెనువెంటనే విరామం లేకుండా సుప్రభాతం మరుసటి రోజు పూజలు ప్రారంభించడం విమర్శలకు తావిస్తోంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Ambani Hospital: అంబానీ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్.. ఎందుకు?

రౌడీషీటర్ సాయికృష్ణ మృతి కేసు : కృష్ణలంక పీఎస్ హెడ్ కానిస్టేబుళ్ల లొంగుబాటు

కేతన్‌ నుంచి కోటి రూపాయలు తీసుకున్న సియా.. ప్రియుడికి ఇచ్చిందట!

టెన్త్ విద్యార్థులకు శుభవార్త చెప్పిన సీబీఎస్ఈ

చెరువులో మృతదేహాలను తాళ్లతో బైకుకు కట్టి ఉంచారు.. ఎక్కడ?

అన్నీ చూడండి

లేటెస్ట్

తిరుమల చరిత్రలోనే తొలిసారి.. లక్షన్నర మందికి పైగా భక్తుల దర్శనం

29-06-2026 సోమవారం ఫలితాలు - దుబారా ఖర్చులు విపరీతం...

28-06-2026 ఆదివారం ఫలితాలు - భేషజాలకు పోవద్దు.. పెద్దలను సంప్రదించండి...

ఈ ఆదిత్య శ్లోకాలతో రోజంతా హాయిగా, ఆరోగ్యంగా...

28-06-2026 నుంచి 04-07-2026 వరకు మీ వార ఫలితాలు

Show comments