శ్రీవారి సేవకులకు మరింత శిక్షణ అవసరం

Webdunia
బుధవారం, 6 మే 2015 (07:56 IST)
తిరుమలలో వివిధ విభాగాలలో భక్తులకు సేవలందిస్తున్న శ్రీవారి సేవకులకు శిక్షణ కార్యక్రమాన్ని మరింత మెరుగుపరచాలని తితిదే తిరుమల సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీకె.ఎస్‌.శ్రీనివాసరాజు ఆధికారులను కోరారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం వివిధ విభాగాల అధికారులతో జెఈవో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ ఈ వేసవిలో ఎక్కువ సంఖ్యలో భక్తులు విచ్చేస్తున్నారని, వారికి శ్రీవారి సేవకుల సేవలు ఎంతో అవసరమని అన్నారు. 
 
అందుకుతగ్గట్టు శ్రీవారి సేవకులు భక్తులతో మెలిగే విధానం, భక్తి, సహనభావం పెంపొందేలా ప్రతి విభాగంలోని అధికారులు తగిన సూచనలు తప్పనిసరిగా చేయాలన్నారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ -1, 2, ఇతర ప్రాంతాల్లో వృథాగా ఉన్న కుర్చీలు, బల్లలు తదితర సామగ్రిని వెంటనే తొలగించాలని సూచించారు. వేసవి కావడంతో తాగునీటి కోసం వచ్చే జంతువులకు అందుబాటులో ఉండేలా ఘాట్‌ రోడ్డు వెంబడి నీటితొట్టెలను ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు నీటిని నింపాల్సిన అవసరముందని అటవీ అధికారులను కోరారు. 
 
వేసవిలో భక్తులకు ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, ఇతర మందులను అవసరమైనంత స్టాక్‌ ఉంచుకోవాలని వైద్యాధికారిని ఆదేశించారు. తిరుమలలోని వంట చెరుకు డిపోను రింగ్‌ రోడ్డు ప్రాంతానికి మార్పు చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. వర్షం కురిసినపుడు ఎటిసి ప్రాంతంలో ఎక్కువగా వర్షపునీరు నిల్వ ఉంటోందని, భక్తులకు ఇబ్బంది లేకుండా సత్వరం తొలగించే చర్యలు చేపట్టాలని సూచించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మన్యం జిల్లాలో నిప్పుల కుంపటి.. ముగ్గురు బలి..

రీల్స్ కోసం నిప్పంటించారు.. గాలి జనార్ధన్ రెడ్డి ఇంట అగ్నిప్రమాదం.. ఎనిమిది మందిపై కేసు

నల్గొండ జిల్లాలో ఘోస్ట్ స్కూల్స్... 315 పాఠశాలల్లో నో స్టూడెంట్స్

అమెరికా చరిత్రలోనే తీవ్రమైన మంచు తుఫాను.. పలు విమానాలు రద్దు

నగరిలో చంద్రబాబు పర్యటన.. పది పైసలకు ప్రయోజనం లేదు.. రోజా ఫైర్

అన్నీ చూడండి

లేటెస్ట్

22-01-2025 గురువారం ఫలితాలు - మాటతీరు అదుపులో ఉంచుకోండి..

20-01-2026 మంగళవారం ఫలితాలు - ఎవరినీ అతిగా నమ్మవద్దు...

19-01-2026 సోమవారం ఫలితాలు - అసాంఘిక కార్యకలాపాల జోలికి పోవద్దు...

18-01-2026 ఆదివారం ఫలితాలు - పనులు ఒక పట్టాన సాగవు.. ఖర్చులు విపరీతం...

మాఘమాసంలో పండుగలు, వసంత పంచమి, రథ సప్తమి, మహాశివరాత్రి

Show comments