Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆహా... ఏడు వాహనాలపై ఏడుకొండలవాడు.. తిరుమలలో రథసప్తమి ప్రారంభం

Webdunia
సోమవారం, 26 జనవరి 2015 (08:35 IST)
మినీ బ్రహ్మోత్సవంగా పేరు పొందిన రథసప్తమి తిరుమలలో సోమవారం ఉదయం ఆరంభమయ్యింది. ఈ ఉత్సవంలో ఒకే రోజు శ్రీవారు ఏడు వాహనల్లో విహరిస్తారు. అందుకే దీనికి మినీ బ్రహ్మోత్సవంగా పేరు. ఇలా ఏడు వాహనాలలో విహరించే శ్రీవారిని దర్శించి తరించేందుకు భక్తులు అశేషంగా తరలి వచ్చారు. ఉదయం 5.30 గంటల నుంచి స్వా మి వారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో వాహనాలపై విహరిస్తున్నారు. వాహన సేవలను తిలకించేందుకు వచ్చే భక్తుల కోసం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది.
 
ఆలయం వద్ద, నాలుగు మాడ వీధుల్లో ప్రత్యేక బ్యారికేడ్లు, గ్యాలరీలు, చలువ పందిళ్లు నిర్మించారు. గాలరీల్లో ఉంటూ వాహన సేవలను తిలకించే భక్తులకు అన్న ప్రసాదాలు, మజ్జిగ, నీళ్లు, వేడిపాలు అందజేయనున్నారు. ఏకదాటిగా  ఏడు వాహ సేవలు ఉండడంతో  కచ్చితమైన సమయాభావాన్ని పాటించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3  మధ్యలో  పుష్కరిణిలో చక్రస్నానం జరుగనుంది.

సుదర్శన చక్రతాళ్వారు స్నానమాచరించే పుణ్యప్రదేశంలో సాధారణ భక్తులు చొరబడకుండా ఇనుప కమ్మీలు నిర్మించారు. తిరుమల భక్త జనంతో కళకళలాడుతోంది. రథసప్తమి సందర్భంగా విఐపి బ్రేకు దర్శనాలను నిలిపేశారు. 
 

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

16-05-2024 గురువారం దినఫలాలు - రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం...

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

Show comments