బ్రహ్మోత్సవాలకు భారీ భద్రత... సీసీ కెమెరాల ఏర్పాటు.. వేలాది మంది సిబ్బంది మోహరింపు

Webdunia
బుధవారం, 16 సెప్టెంబరు 2015 (07:19 IST)
తిరుమల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం భారీ ఎత్తున భద్రతను పెంచింది. సీసీ కెమెరాల ఏర్పాటు.. సాయుధ బలగాల మోహరింపు వంటి చర్యలు తీసుకున్నారు. తీవ్రవాదుల ముప్పు హెచ్చరికలతో తిరుమల సెక్యూరిటీని అమాంతం పెంచేశారు. 
 
మాడ వీధులలో 29 గేట్లను... 13 అత్యవసర ద్వారాలను ఏర్పాటు చేశారు. ప్రతి ద్వారం వద్ద సీసీ కెమెరాను ఏర్పాటు చేశారు. తిరుమలలో 24 గంటలూ బాంబు డిస్పోజల్ టీంలు తిరుగుతుంటాయి. అతిథి గృహాలు, మండపాలు, బహిరంగ ప్రాంతాలు, ఇలా ఒకటేంటి అన్నింటి వద్ద వీరు ఆకస్మిక తనిఖీుల చేస్తూనే ఉంటారు. లక్షలాది మంది జనం ఇక్కడకు చేరుతుండడంతో ఈ ర్యలు తీసుకున్నారు. 
 
బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఎన్డీఆర్ఎఫ్ దళం, రెండు ఆక్టోపస్ దళాలు తిరుమలలో తిష్ట వేశాయి. వీరికి తోడుగా ఒక గ్రేహౌండ్స్ దళాలు, 2600 మంది హోంగార్డులు, ఎస్పీఎఫ్ దళాలు 24 గంటలు విధులు నిర్వహిస్తారు. తిరుమల ఆలయం చుట్టూ ఐరన్ గ్రిల్ ఏర్పాటు చేశారు. నడక దారిలో భద్రతను కూడా పెంచారు. అడుగడునా భక్తులకు సహకరించే విధం ఏర్పాట్లు చేశారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రేమ పేరుతో కుచ్చుటోపీ.. రూ.81లక్షలు కోల్పోయిన యువకుడు..

తెలంగాణ రైతులను ముంచేసిన అకాల వర్షాలు (video)

ఏపీలోనే కాదు.. దక్షిణాదిలో మధ్యప్రదేశ్‌ దొంగలతో జాగ్రత్త.. ముగ్గురి అరెస్ట్

బలమైన గాలులు, ఉరుములతో కూడిన వర్షాలు.. పిడుగుపాటుకు మహిళలు మృతి

ఇరాన్‌లో అంతర్గత విభేదాలు, అమెరికాతో మాట్లాడేవాళ్లెవరో చూస్తున్నా: ట్రంప్

అన్నీ చూడండి

లేటెస్ట్

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వివాదం.. నివేదిక సిద్ధం..జూన్ 30న సమర్పణ

25-04-2026 శనివారం ఫలితాలు - ధనం మితంగా ఖర్చుచేయండి

శ్రీవారికి కానుకగా 753 గ్రాముల బంగారు పతకాలను ఇచ్చిన బెంగళూరు భక్తురాలు

పెంచలకోన.. భారీ సర్ప ఆకారపు కొండ.. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు

Masik Durgashtami: దుర్గాష్టమి రోజున దుర్గాదేవి పూజ.. ఎవరైతే విజయం కోరుకుంటారో?

Show comments