Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో అందమైన తెప్పలపై ఊరేగిన మలయప్ప స్వామి

Webdunia
మంగళవారం, 3 మార్చి 2015 (20:23 IST)
తిరుమలలో తెప్పోత్సవాల సందర్భంగా మలయప్ప స్వామి పుష్కరణిలోని తెప్పలపై ఊరేగారు. మంగళవారం సాయంత్రం సతీసమేతంగా ఊరేగింపుగా తిరుమాడ వీధులలో ఊరేగిన స్వామి వారు అనంతరం పుష్కరణిలోని పుష్పాలతో అలంకరించిన తెప్పలపై ఊరేగారు. వార్షిక ప్లవతోత్సవంలో భాగంగా మూడో రోజు భక్తులకు మలయప్ప స్వామి కనువిందు చేశారు. వారిని కరుణించాడు. 
 
 మొదటి రెండు రోజులు శ్రీరామ, శ్రీకృష్ణ అవతారాలలో దర్శనం ఇచ్చిన స్వామి మూడోరోజు మలయప్ప స్వామిగా తెప్పలపై ఊరేగారు. సాయంత్రం 7 నుంచి 8 గంటలకు మధ్యలో పుష్కరణలోని వసంత మండపం చుట్టూ మూడు మార్లు తిరిగిన స్వామి మండపలో కొలువుదీరారు.  
 
ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్త కార్యనిర్వహణాధికారి కేఎస్ శ్రీనివాస రాజు, ఏవిఎస్వో శివకుమార్ రెడ్డి, డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ, పేష్కార్ ఆర్ సెల్వం, శ్రీ కేశవ రాజు, పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

13-05-2024 సోమవారం దినఫలాలు - హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమం...

12-05-2024 ఆదివారం దినఫలాలు - మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం...

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

Show comments