తిరుమల గిరులకు పోటెత్తిన భక్తజనం

Webdunia
శనివారం, 23 మే 2015 (08:26 IST)
పదో తరగతి, ఎంసెట్‌ ఫలితాలు వెలువడడంతో విద్యార్థులు మొక్కులు తీర్చుకోవడానికి తిరుమలకు క్యూకట్టారు. శనివారం ఉదయం కూడా కొండ కిటకిటలాడింది. దీనికి వారాంతపు రద్దీ తోడవడంతో తిరుమలంతా జనమే జనం. దీంతో సర్వదర్శనానికి 20 , దివ్యదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. సర్వ, దివ్యదర్శన క్యూలైన్లు క్యూకాంప్లెక్సులు నిండి నారాయణగిరి ఉద్యానవనంలోకి కిలోమీటర్‌కు పైగా వ్యాపించాయి. 
 
మహాలఘు దర్శనం నిరంతరాయంగా కొనసాగుతున్నా రద్దీ ఏ మాత్రం తగ్గలేదు. ఆలయం ముందు, నాలుగుమాడ వీధులు, అఖిలాండం, లడ్డూ వితరణశాల, నిత్యాన్న సముదాయం, కల్యాణకట్ట భక్తులతో కిక్కిరిశాయి. వచ్చిన వారికి వచ్చినట్లు కేటాయిస్తుండడంతో గదులన్నీ సాయంత్రానికే నిండిపోయాయి. ఆ తర్వాత వచ్చిన భక్తులు వసతి సౌకర్యం లేక ఇబ్బందులు పడ్డారు. ఆదివారం రద్దీ మరింత పెరిగే అవకాశాలున్నాయి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇక అమెరికా ఏం గెలుస్తుంది? రూ.150 కోట్ల విమానాన్ని చిన్న బాణంతో కూల్చేసిన ఇరాన్

తెలంగాణాలో బతకాలంటే ప్రత్యేక పాస్‌పోర్టు కావాలా? బీజేపీ నేత విష్ణువర్థన్ రెడ్డి

రాజస్థాన్‌లో దారుణం : నలుగురిని హత్య చేసి దహనం చేసిన మాజీ సర్పంచ్ మొదటి భార్య

నీట్ పేపర్ లీక్ లోపాలకు జవాబుదారీతనం ఉండాల్సిందే : సుప్రీంకోర్టు

స్వచ్ఛ గోదావరి - పవిత్ర పుష్కరాలు : కాలుష్య రహిత గోదావరి కోసం నిరంతర తనిఖీలు : పవన్ ఆదేశం

అన్నీ చూడండి

లేటెస్ట్

శుక్రవారం ఫలితాలు - ఆర్థికంగా విశేష ఫలితాలున్నాయి

28-05-2026 గురువారం ఫలితాలు - ధనం మితంగా ఖర్చు చేయండి

మూడేళ్లకు ఒకసారి వచ్చే పద్మిని ఏకాదశి.. తులసి దళాలతో అర్చన చేస్తే?

27-05-2026 బుధవారం ఫలితాలు- దంపతుల మధ్య అకారణ కలహం

Eid Al-Adha 2026 date: తెలుగు రాష్ట్రాల్లో మే 28, 2026 గురువారం బక్రీద్.. సెలవు దినం

Show comments