సామాన్యులకు పెద్దపీట.. ఒకే లైను.. గత అనుభవాలను పరిగణలోకి : ఈవో

Webdunia
బుధవారం, 31 డిశెంబరు 2014 (13:57 IST)
గత అనుభవాలు, తొక్కిసలాటలు, ఇబ్బందులు.. ఇలాంటవన్నీ తమ కళ్ల ముందు ఇంకా మెదలాడుతూనే ఉన్నాయనీ, తిరిగి పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకుంటామని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో డి సాంబ శివరావు తెలిపారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా కేవలం అందరికీ ఒకే ఒక లైను మాత్రమే నడుపుతామని  అన్నారు. బుధవారం మధ్యాహ్నం తిరుమలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సామాన్య భక్తులకే పెద్ద పీట వేయాలని నిర్ణయించామన్నారు. 
 
విఐపిల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి ఉందని అయినప్పటికీ గతంలో వచ్చిన విమర్శలను పరిగణలోకి తీసుకుని వారు అడినంత మందిని అనుమతించలేమని అన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన వారి వెంట కేవలం ముగ్గురిని మాత్రమే అనుమతిస్తున్నామని చెప్పారు. వారు ఐదు మంది అనుమతించాలని కోరుతున్నా అది సాధ్య కాని పని అని అన్నారు. విఐపిలను తెల్లవారుజామున 1.45గంటల నుంచి 5 గంటల వరకూ అనుమతిస్తామన్నారు. అయితే వీలైతే వీరిని 4 గంటల లోపే పూర్తి చేసి ఆ సమయాన్ని కూడా సామాన్యులకు కేటాయిస్తామని చెప్పారు.
 
సామాన్యుల రద్దీ దృష్టిలో పెట్టుకుని కనీసం 500 మంది టీటీడీ అధికారులను తిరమలకు బదలాయించినట్లు వివరించారు. దాదాపు 3200 మంది శ్రీవారి సేవకులు వైకుంఠ ఏకాదశి సందర్భంగా పని చేస్తారని చెప్పారు. రద్దీ అధికంగా ఉండి తొపులాట, తొక్కిసలాట జరిగే అవకాశం ఉన్నచోట్ల ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ ఉంటుందన్నారు. అక్కడే అదనపు అధికారులు ఉంటారని చెప్పారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మా బలగాల్లో సత్తా లేదు... బలూచిస్తాన్ వేర్పాటువాదుల చేతిలో ఓడిపోయాం.. పాకిస్తాన్

ఆన్‌లైన్ గేమ్స్ ఆడొద్దన్న తల్లిదండ్రులు.. 9వ ఫ్లోర్ నుంచి దూకేసిన అక్కా చెల్లెళ్లు

TGSRTC : బడ్జెట్-ఫ్రెండ్లీ గోవా టూర్ ప్యాకేజీని ప్రారంభించిన టీజీఎస్ఆర్టీసీ

నిద్రపోతున్నట్టు నటిస్తూ.. తోటి ప్రయాణికురాలికి లైంగిక వేధింపులు.. దోషిగా తేల్చిన యూఎస్ కోర్టు

Bill Gates: ఫిబ్రవరి 18న అమరావతిని సందర్శించనున్న మైకోసాఫ్ట్ చీఫ్ బిల్ గేట్స్

అన్నీ చూడండి

లేటెస్ట్

01-02-2026 నుంచి 07-02- 2026 వరకు మీ వార ఫలితాలు.. ఏ రాశులకు లాభం?

01-02-2026 నుంచి 28-02- 2026 వరకు మాస ఫలితాలు- డబ్బుకు ఇబ్బంది ఉండదు

31-01-2026 శనివారం ఫలితాలు : పెట్టుబడులకు మంచి తరుణం కాదు...

30-01-2026 శుక్రవారం ఫలితాలు - కష్టమనుకున్న పసులు తేలికగా..?

భీష్మఏకాదశి రోజున ఏ కార్యాన్ని ప్రారంభించినా శుభమే-విష్ణు సహస్ర నామం, భగవద్గీతను?

Show comments