తిరుమలలో వైభవంగా ప్రారంభమైన పవిత్రోత్సవాలు

Webdunia
బుధవారం, 26 ఆగస్టు 2015 (07:16 IST)
తిరుమలలో పవిత్రోత్సవాలు వైభవంగా మంగళవారం ఆరంభమయ్యాయి. శ్రీవారికి సుప్రభాతం, మొదటి నైవేద్యం, రెండో ఘంట అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి పల్లకిని అధిరోహించి పవిత్రోత్సవ మండపానికి వేంచేశారు. మండపంలో అర్చకస్వాములు ఏడు హోమ గుండాల్లో అగ్ని ప్రతిష్ట చేసి వీటి మధ్య నవకలశాన్ని, మరో వేదికపై ప్రాయశ్చిత్త కలశాన్ని ప్రతిష్ఠించారు. స్నానపీఠంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామిని ఆశీనుల్ని చేశారు. పట్టుపవిత్రాలను యాగశాలలో ప్రతిష్ఠించి వైఖానస ఆగమోక్తంగా హోమాలు నిర్వహించారు. 
 
హోమం అనంతరం స్వామివారి ఉత్సవమూర్తులకు కంకణధారణ చేసి హోమతిలకం పెట్టిన అనంతరం భక్తులతో సంకల్పం చెప్పించారు. అనుష్ఠాన క్రియల అనంతరం స్నపన తిరుమంజనం జరిగింది. ఉత్సవమూర్తులకు నూతన పట్టువస్త్రాలను అలంకరిస్తుండగా జీయంగార్లు, వైష్ణవస్వాములు దివ్యప్రబంధాన్ని పారాయణం చేశారు. 
 
ఏకాంతంగా నైవేద్యం నివేదన జరిగింది. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి సర్వాభరణాలతో, రంగురంగుల పుష్పమాలలతో అలంకరించి తిరువీధుల్లో అత్యంత వైభవంగా వూరేగించారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

హోర్ముజ్ జలసంధి మూసివేత.. దేశంలో పెట్రో ధరలు భగ్గు?

ఖమేనీ మృతిపై ప్రియాంకా మండిపాటు - కన్నుకు కన్ను సిద్ధాంతం ప్రపంచాన్ని గుడ్డిది చేస్తుంది...

అశ్లీల వీడియోపై తితిదే చైర్మన్ వివరణ.. సన్నాసులకు ఎడిటింగ్ కూడా సరిగ్గా రాదు (వీడియో)

చరిత్రలో అత్యంత క్రూరుడైన ఖమేనీ మరణించాడు.. ట్రంప్ ప్రకటన

ఆ వీడియోలో వున్నది నేను కాదు, సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసా: తితిదే చైర్మన్ బి.ఆర్ నాయుడు

అన్నీ చూడండి

లేటెస్ట్

27-02- 2026 శుక్రవారం ఫలితాలు : దూర ప్రయాణంలో అవస్థలెదుర్కుంటారు...

26-02-2026 గురువారం ఫలితాలు - కొత్త సమస్యలు తలెత్తకుండా...?

Hanuman Chalisa.. హనుమాన్ చాలీసాను రోజూ పఠిస్తే.. ఏంటి ఫలితం?

Amalaki Ekadashi 2026: అమలకి ఏకాదశి రోజున ఉసిరి చెట్టును పూజిస్తే..?

Baba Vanga predictions: ఆ నాలుగు రాశులకు అదృష్టం తలుపు తడుతుందట..

Show comments