Webdunia - Bharat's app for daily news and videos

Install App

14 నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు.. టీటీడీ ఈవో

Webdunia
శనివారం, 3 అక్టోబరు 2015 (07:39 IST)
తిరుమలలో ఈ నెల 14 నుంచి 22 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో సాంబశివరావు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆర్జిత సేవుల, ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. 
 
తిరుమలలో శుక్రవారం జరిగిన డయల్‌ యువర్‌ తితిదే ఈవో కార్యక్రమం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి అర్జిత సేవలు, చంటిబిడ్డలతో పాటు తల్లిదండ్రులకు, వయోవృద్ధులు, ప్రత్యేక ప్రతిభావంతులకు ప్రత్యేక ప్రవేశ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. అదే సమయంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అడ్వాన్సు బుకింగ్ లేకుండా ఫస్ట్ కమ్ ఫస్ట్ ప్రాతిపదికన ఇవ్వనున్నట్లు ప్రకటించారు. 
 
వీఐపీ దర్శనాలను ప్రొటోకాల్‌ పరిధిలోని ప్రముఖులకు మాత్రమే కల్పిస్తామని స్పష్టం చేశారు.నవరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నట్లు ఆయన వివరించారు. వార్షిక బ్రహ్మోత్సవాల తరహాలోనే ఘనంగా నిర్వహించనున్నట్లు వివరించారు. 

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

16-05-2024 గురువారం దినఫలాలు - రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం...

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

Show comments