అన్యమత ప్రచారకులుగా టిటిడి ఉద్యోగులు : సమతానంద స్వామి

Webdunia
ఆదివారం, 21 డిశెంబరు 2014 (09:15 IST)
టీటీడీలోనే ఉద్యోగులలో కొందరు అన్యమత ప్రచారకులుగా ఉన్నారని సమతానంద స్వామి తెలిపారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ క్షేత్రంగా ప్రకటించాలని డిమాండ్ చేసింది. శనివారం హిందూ రక్షా సమన్వయ సమితి ఆధ్వర్యంలో తిరుపతి అర్బన్ తహశీల్దార్ కార్యాలయూన్ని ముట్టడించారు. 
 
ఈ సందర్భంగా సమితి నిర్వాహకులు కాకినాడకు చెందిన సమతానంద స్వామి మాట్లాడుతూ హిందూ ఆలయంలో జీతాలు తీసుకుంటూ అన్యమత ప్రచారం చేయడం దురదృష్టకరమన్నారు. వారిని బదిలీ సరిపెట్టకుండా పూర్తి స్థాయిలో తొలగించాలని కోరారు. హిందువులు కానివారే టీటీడీలో పెత్తనం చెలాయిస్తున్నారని విమర్శించారు. తిరుపతిని పూర్తిస్థాయి హిందూ క్షేత్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. 
 
టీటీడీ చిన్నస్థాయి ఉద్యోగి కూడా హిందువై ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనుమతులు లేని ప్రార్థనా మందిరాలకు నోటీసులు ఇవ్వాలని తహశీల్దార్ కార్యాలయం ముందు భీష్మించుకుని కూర్చున్నారు. దీనికి ముందు వందలాది మంది హిందూ రక్షా సమన్వయ సమితి సభ్యులతో శ్రీనివాసం వద్ద నుంచి ర్యాలీగా తహశీల్దార్ కార్యాలయూనికి వచ్చారు. ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షుడు గౌరయ్య, రామాంజనేయులు, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం రేవంత్ రెడ్డి కులాన్ని ఒక సమస్యగా మారుస్తున్నారు.. కవిత

నితిన్ నబిన్ టూర్ వల్ల కేవలం గాడిద గుడ్డు మాత్రమే వస్తుంది.. రేవంత్ రెడ్డి

Ambati Rambabu: సీఎం చంద్రబాబుపై వ్యాఖ్యలు.. హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు

శ్రీశైలంలో కల్తీ నెయ్యి కలకలం - సేమ్ తిరుమల తరహాలోనే సాగిందా?

చెన్నైలో బర్డ్ ఫ్లూ కలకలం.. చనిపోయిన కాకులను తాకొద్దంటూ హెచ్చరిక

అన్నీ చూడండి

లేటెస్ట్

శబరిమలలో మరో వివాదం.. పంపా సమీపంలో సినిమా షూటింగ్.. ఎప్పుడంటే?

02-02-2026 సోమవారం ఫలితాలు - కార్యసిద్ధికి ఓర్పుతో శ్రమించండి...

01-02-2026 ఆదివారం ఫలితాలు.. మీ శ్రీమతి వద్ద ఏదీ దాచవద్దు.. నష్టపోతారు

01-02-2026 నుంచి 07-02- 2026 వరకు మీ వార ఫలితాలు.. ఏ రాశులకు లాభం?

01-02-2026 నుంచి 28-02- 2026 వరకు మాస ఫలితాలు- డబ్బుకు ఇబ్బంది ఉండదు

Show comments