భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ టోకెన్ల పంపిణీలో మార్పులు తీసుకు వచ్చింది. రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్సులో అదనపు లడ్డూ టోకెన్ల జారీని శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ సోమవారం ప్రారంభించారు. ఈ అదనపు లడ్డూ టోకెన్ల కౌంటర్లను త్రిలోక్ కాంట్రాక్టు సంస్థ సౌజన్యంతో టీటీడీ ఏర్పాటు చేసింది.
క్యూకాంప్లెక్సులో అందుబాటులో ఉన్న యాక్సస్ కార్డు జారీ సమయంలోనే అవసరమైన భక్తులకు అదనపు లడ్డూ టోకెన్లను మంజూరు చేస్తున్నారు. కాగా, ఈ క్యూలైన్లో వెళ్లే ఒక్కో భక్తుడు రెండు రాయితీ, రెండు అదనపు లడ్డూ టోకెన్లు చొప్పున నాలుగింటిని పొందవచ్చు.