సారూ... మీరు చెప్పి మూడు రోజుల కూడా కాలేదు.. అప్పుడే లడ్డూల కొరత

Webdunia
సోమవారం, 14 సెప్టెంబరు 2015 (08:17 IST)
లడ్డూలకు ఎటువంటి కొరత లేదని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో సాంబశివరావు చెప్పి మూడు రోజులు కూడా కాలేదు. తిరుమలలో లడ్డూల కొరత ఏర్పడింది. ఆరు లక్షల లడ్డూలు నిల్వ ఉంచుతున్నామని ఆయన వెల్లడించారు. అయితే సాధారణంగా ఇచ్చే లడ్డూలలోనే కోత విధించారు. వివరాలిలా ఉన్నాయి. 
 
తిరుమలలో ఆదివారం చాలా మంది భక్తులకు లడ్డూలు లభించలేదు. అదనపు లడ్డూలు లేక వెనుదిరగాల్సి పరిస్థితి ఏర్పడింది. ఎటువంటి సిఫారసు లేకుండానే ఆలయం వెలుపల రోజూ 25 వేల అదనపు లడ్డూలు కేటాయించేవారు. వీటిని ప్రత్యేక క్యూలైన్ల ద్వారా విక్రయిస్తారు. అయితే ఆదివారం కేవలం 15 వేల లడ్డూలు మాత్రమే కేటాయించారు. 
 
అంతకు మునుపు లక్ష లడ్డూలు ఇచ్చేవారు. దానిని క్రమంగా 50 వేలకు, తర్వాత 25వేలకు తగ్గించేశారు. ఆదివారం ఆ 25లలో కూడా కోత విధించారు. కేవలం 15 వేలు మాత్రమే కేటాయించారు. దీంతో అదనపు లడ్డూలు కావాలనుకున్న వారికి తిప్పలు తప్పలేదు.  లడ్డూలు దొరకకుండానే వెనుదిరిగారు.  బ్రహ్మోత్సవాలను పరిగణలోకి తీసుకున్న అధికారులు నిల్వ ఉంచడంతో భాగంగా అదనపను లడ్డూలకు కోత విధించినట్లు తెలుస్తోంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

US Supermarket: భారతీయ మహిళను కాల్చి చంపిన దుండగుడు

అక్రమ వలసదారులకు బెంగాల్ సీఎం వార్నింగ్... వెళ్లిపోతారా.. వెళ్లగొట్టమంటారా?

బక్రీద్ పండుగ.. డిజిటల్ చెల్లింపుల ముసుగులో మోసం జాగ్రత్త.. సజ్జనార్

ఔటర్ రింగ్ రోడ్డుపై తగలబడిన ఎయిరిండియా బస్సు

మీనాక్షి అమ్మవారి ఆలయ కార్ పార్కింగ్‌ వద్ద 17ఏళ్ల బాలుడి హత్య

అన్నీ చూడండి

లేటెస్ట్

Eid Al-Adha 2026 date: తెలుగు రాష్ట్రాల్లో మే 28, 2026 గురువారం బక్రీద్.. సెలవు దినం

26-05-2026 మంగళవారం ఫలితాలు - ధనసహాయం తగదు

25-05-2026 సోమవారం ఫలితాలు - ఖర్చులు అదుపులో ఉండవు.. ముఖ్యుల కలయిక వీలుపడదు...

24-05-2026 ఆదివారం ఫలితాలు - సంతోషకరమైన వార్త వింటారు

24-05-2026 నుంచి 30-05-2026 వరకు ఫలితాలు - రుణ ఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు

Show comments