కృష్ణా పుష్కర ఘాట్లను గుర్తించండి... దేవాదాయ శాఖ

Webdunia
మంగళవారం, 4 ఆగస్టు 2015 (12:28 IST)
దేవాదాయ శాఖ అధికారులు, ఉద్యోగులు కృష్ణా పుష్కరాలకు సిద్ధమవుతున్నారు. అప్పడే పుష్కర ఘాట్లను గుర్తించేందుకు దేవాదాయశాఖ ఆదేశాలు జారీ చేసింది. సోమవారం ఆ శాఖ గుంటూరు జోన్‌ ఉప కమిషనర్‌ (డీసీ) సురేష్‌బాబు, ఏసీ కేబీ శ్రీనివాసులు డీసీ కార్యాలయంలో కృష్ణా పుష్కర ఏర్పాట్లపై తొలిసారిగా సమీక్షా సమావేశం నిర్వహించారు. 
 
అనంతరం డీసీ సురేష్‌బాబు మాట్లాడుతూ.. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆ శాఖ అధికారులకు స్పష్టం చేశారు.  జిల్లాలో సాధ్యమైనంతవరకు అధిక సంఖ్యలో పుష్కర ఘాట్లను గుర్తించాలన్నారు. గత కృష్ణా పుష్కరాలకు 52 ఘాట్లు నిర్మాణం జరిగిందన్నారు. ఈసారి అదనంగా 20 ఘాట్లను ప్రాథమికంగా గుర్తించడం జరిగిందన్నారు. ఇప్పటికే 72 ఘాట్లు అయినప్పటికీ ఇంకా మరిన్ని ఘాట్ల ఏర్పాటుకు అనువైన ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎంపిక చేయాలన్నారు. 
 
జిల్లాలో కృష్ణానది పరివాహక ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆయా చోట్ల గతంలో ఏర్పాటు చేసిన ఘాట్లు ఎలా ఉన్నాయి, కొత్తగా ఇంకా ఎక్కడెక్కడ ఘాట్లు నిర్మాణం చేయవచ్చు, వాటికి సమీపంలో ఏఏ ఆలయాలు ఉన్నాయి వాటిని పటం రూపంలో రూపొందించి నివేదికలను ఆలయ కార్యనిర్వహణాధికారులు, మేనేజర్లు, డివిజన్ల ఇన్స్‌పెక్టర్లు రెండు రోజుల్లోగా అందజేయాలని అధికారులు ఆదేశించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కేంద్రం మొత్తం బడ్జెట్ రూ.53.5 లక్షల కోట్లు : రక్షణ శాఖకు రూ.7.85 లక్షల కోట్లు

నిర్మలమ్మ పద్దుల చిట్టా... అమరావతికి నిధుల వరద

అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తుందని తల్లీబిడ్డలపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మహిళ

నారా లోకేశ్‌పై జోగి రమేశ్ అనుచిత వ్యాఖ్యలు.. రెచ్చిపోయిన టీడీపీ శ్రేణులు.. ఇంటికి నిప్పు

వార్షిక బడ్జెట్ 2026 : రక్షణ శాఖకు రికార్డు స్థాయిలో కేటాయింపులు

అన్నీ చూడండి

లేటెస్ట్

భీష్మఏకాదశి రోజున ఏ కార్యాన్ని ప్రారంభించినా శుభమే-విష్ణు సహస్ర నామం, భగవద్గీతను?

Mega Medaram Maha Jathara: మేడారం మహా జాతరకు సుమారు మూడు కోట్ల మంది భక్తులు

29-01-2026 రాశి ఫలితాలు, ఫోన్ సందేశాలు నమ్మవద్దు

28-01-2026 బుధవారం ఫలితాలు - మొండిగా పనులు పూర్తి చేస్తారు...

జనవరి 28 నుండి 31 వరకు మేడారం జాతర.. భారీ స్థాయిలో భక్తులు

Show comments