మీలోని సేవా శక్తిని వెలికి తీయండి : సిబ్బందికి టీటీడీ ఈవో పిలుపు

Webdunia
గురువారం, 18 డిశెంబరు 2014 (20:30 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం చాలా శక్తివంతమైన సంస్థ అనీ, అందులో పని చేసే అధికారులు సిబ్బంది చాలా శక్తి యుక్తులు కలిగిన వారని ఆ సంస్థ కార్యనిర్వహణాధికారి తెలిపారు. వారు తమలో శక్తిని వెలికి తీసి సంస్థ పేరు ప్రతిష్టలను మరింత ఇనుమడింప చేసేలా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. 
 
గురువారం సాయంత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలోని విభాగాధిపతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తప్పకుండా టిటిడి సిబ్బందిలోని శక్తి యుక్తులను వెలికి తీస్తారనే నమ్మకం తనుకుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పని చేస్తే తప్ప వారికి మరింత పేరు ప్రతిష్టలు రావని ఆ దిశగా విభాగాధిపతులు మిగిలిన వారిని ఉత్సాహ పరచాలని కోరారు. విద్యా,వైద్యం, ఆధ్యాత్మిక విభాగాలలో టిటిడి ఇప్పటికే సేవలు అందిస్తోందని, అందులోనే మరింత సేవలు అందేలా కష్ట పడాలని కోరారు. 
 
 తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ సంస్థగా తీర్చిదిద్దడానికి అవసరమైన సహాయ సహకారాలు సిబ్బందికి తన నుంచి ఎప్పుడూ లభిస్తాయని ఆయన హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో తిరుపతి జేఈవో పోలా భాస్కర్, తిరుమల జేఈవో కె ఎస్ శ్రీనివాస రాజు, సిఈ చంద్ర శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉర్దూ నేర్పిన ప్రిన్సిపాల్‌ను చెంపపై కొట్టిన బీజేపీ నేత మందుల బాలు అరెస్ట్

వడ్డీకి పదిలక్షలు.. ఇంట్లో నిధులని మోసం.. దంపతుల ఆత్మహత్య.. ఐదు నెలల పసికందు?

ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు... రైలు సర్వీసులు రద్దు.. 22 వేల మంది వరద బాధితులు

సీఎం విజయ్ కీలక నిర్ణయం : తమిళనాడులో పరుగులు పెట్టనున్న ఏసీ బస్సులు

ప్రైవేట్ పాఠశాలల నుండి ప్రభుత్వ పాఠశాలలకు 2 లక్షల మంది విద్యార్థులు

అన్నీ చూడండి

లేటెస్ట్

30-06-2026 మంగళవారం ఫలితాలు - దంపతుల మధ్య అకారణ కలహం

తిరుమల చరిత్రలోనే తొలిసారి.. లక్షన్నర మందికి పైగా భక్తుల దర్శనం

29-06-2026 సోమవారం ఫలితాలు - దుబారా ఖర్చులు విపరీతం...

28-06-2026 ఆదివారం ఫలితాలు - భేషజాలకు పోవద్దు.. పెద్దలను సంప్రదించండి...

ఈ ఆదిత్య శ్లోకాలతో రోజంతా హాయిగా, ఆరోగ్యంగా...

Show comments