పాదరక్షలతోనే భోజనం చేయడం మంచిదా?

Webdunia
శనివారం, 11 అక్టోబరు 2014 (18:19 IST)
భోజనం చేసే విధానంలో మార్పులొచ్చేశాయి. ఆహారం తీసుకునేందుకు నియమ నిబంధనలు కనుమరుగయ్యాయి. ఎక్కడో ఓ చోట కూర్చుని కానించేయడం.. కుర్చీల మీద భోజనం చేసేయడం, హడావుడిగా తినడం వంటివి ప్రస్తుతం పరిపాటి అయిపోయాయి. ఇంకా దారుణం ఏమిటంటే ఫ్యాషన్ పోకడల కారణంగా పాదరక్షలను సైతం విడవకుండా అలానే ఆహారాన్ని తీసుకుంటున్నారు. ఈ పద్ధతి సరికాదని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. 
 
భగవంతుడు అందించిన ఆహారం ఈ విధంగా స్వీకరించడం మంచిది కాదని వారు చెబుతున్నారు. ఎవరికి ఎన్ని పనులు వున్నా, ఎంత తీరిక లేకుండా వున్నా భోజనం చేసే విషయంలో కొన్ని నియమ నిబంధలను పాటించాలి.
 
స్నానం చేసి, పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి, పద్మాసనం వేసినట్టుగా కూర్చుని నిదానంగా భోజనం చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. 
 
తూర్పు ముఖంగా గానీ, దక్షిణ ముఖంగా గాని కూర్చుని మనసును ప్రశాంతంగా ఉంచుకుని భగవంతుడి నామాన్ని స్మరిస్తూ భోజనం చేయాలి. లేదంటే ఆరోగ్య సంబంధమైన సమస్యలు తలెత్తడమే కాకుండా, ఆయుష్షు, యశస్సు నశిస్తాయని ఆధ్యాత్మిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం రేవంత్ రెడ్డి కులాన్ని ఒక సమస్యగా మారుస్తున్నారు.. కవిత

నితిన్ నబిన్ టూర్ వల్ల కేవలం గాడిద గుడ్డు మాత్రమే వస్తుంది.. రేవంత్ రెడ్డి

Ambati Rambabu: సీఎం చంద్రబాబుపై వ్యాఖ్యలు.. హైకోర్టును ఆశ్రయించిన అంబటి రాంబాబు

శ్రీశైలంలో కల్తీ నెయ్యి కలకలం - సేమ్ తిరుమల తరహాలోనే సాగిందా?

చెన్నైలో బర్డ్ ఫ్లూ కలకలం.. చనిపోయిన కాకులను తాకొద్దంటూ హెచ్చరిక

అన్నీ చూడండి

లేటెస్ట్

Ramzan: హైదరాబాద్ ఓల్డ్ సిటీలో జోరందుకున్న రంజాన్ షాపింగ్

శబరిమలలో మరో వివాదం.. పంపా సమీపంలో సినిమా షూటింగ్.. ఎప్పుడంటే?

02-02-2026 సోమవారం ఫలితాలు - కార్యసిద్ధికి ఓర్పుతో శ్రమించండి...

01-02-2026 ఆదివారం ఫలితాలు.. మీ శ్రీమతి వద్ద ఏదీ దాచవద్దు.. నష్టపోతారు

01-02-2026 నుంచి 07-02- 2026 వరకు మీ వార ఫలితాలు.. ఏ రాశులకు లాభం?

Show comments