ప్రపంచానికి భగవద్గీత మార్గ దర్శకం : జేఈవో పోలా భాస్కర్

Webdunia
బుధవారం, 11 ఫిబ్రవరి 2015 (19:54 IST)
సమస్త మానవాళికి భగవద్గీత మార్గదర్శకంలాంటిదని తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్త కార్యనిర్వహణాధికారి పోలా భాస్కర్ అన్నారు. అటువంటి భగవద్గీతను ప్రతీ ఒక్కరు పారాయణం చేయాలని కోరారు. తిరుపతి గాయకుడు గంగాధర్ రూపొందించిన సంపూర్ణ భగవద్గీత తొలికాపీని అలిపిరి పాదాల మండపం నుంచి కాలి నడక తిరుమలకు తీసుకెళ్ళడాన్ని ప్రారంభించారు. అక్కడ స్వామి పాదపద్మాల వద్ద ఉంచిన తరువాత దానిని తొలి కాపీని విడుదల చేస్తారు. 
 
ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ, నిజ జీవితానికి భగవద్గీతలో ఎన్నో మార్గాలు, సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయని ఆయన చెప్పారు. దీనిని రూపొందించడంపై నేపథ్య గాయకుడు, భగవద్గీత పౌండేషన్ అధ్యక్షుడు అయిన గంగాధర్ ను కొనియాడారు.  ఈ సిడీ ప్యాక్ లో 20 సిడిలు ఉంటాయని, వాటిలో 18 చాప్టర్లు, మిగిలిన రెండు సిడీ వివరణలతో కూడినవి ఉంటాయని గంగాధర్ తెలిపారు. 
 
ఈ సిడిలు, డాక్యుమెంటరీ తయారీకి తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తున్న సహాసహకారానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మప్రచార పరిషత్ ప్రత్యేకాధికారి రఘునాథ్, ఎస్వీ మ్యూజిక్ కాలేజీ ప్రిన్సిపల్ వైవిఎస్ పద్మావతీ తదితరులు పాల్గొన్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్ళికి నిరాకరించిన యువతి.. కత్తితో పొడిచిన యువకుడు.. చివరకు నాటు బాంబు పేలి...

28-06-2026 : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వెదర్ రిపోర్ట్- 33 జిల్లాలకు భారీ వర్ష సూచన

తిరుపతి విమానాశ్రయం మినహా బార్లు, మద్యం దుకాణాలు.. ఏపీ మార్గదర్శకాలు

ఉత్తర భారతదేశంలో కంపించిన భూమి... ఆప్ఘనిస్థాన్ ఎఫెక్ట్

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి హెచ్చరిక చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత

అన్నీ చూడండి

లేటెస్ట్

ఈ ఆదిత్య శ్లోకాలతో రోజంతా హాయిగా, ఆరోగ్యంగా...

28-06-2026 నుంచి 04-07-2026 వరకు మీ వార ఫలితాలు

Shani Pradosh Vrat 2026: శని ప్రదోషం.. శివాలయాల్లో ఒక్క దీపమైనా వెలిగించండి..

27-06-2026 శనివారం ఫలితాలు - మీ కష్టం ఫలిస్తుంది

హనుమాన్ చాలీసా శక్తి, ప్రతి శనివారం పఠిస్తే...

Show comments