Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయ్యప్ప స్వామి దర్శనానికి ఆన్‌లైన్ బుకింగ్ ఆరంభం

Webdunia
సోమవారం, 20 అక్టోబరు 2014 (11:36 IST)
శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి ఆన్‌లైన్ బుకింగ్ సేవలు ప్రారంభమయ్యాయి. శబరిమలలో నవంబరు 16వ తేది మండల పూజ ప్రారంభమవుతుంది. స్వామి దర్శనం కోసం ఆన్‌లైన్ బుకింగ్ సౌకర్యం ఉన్న విషయం తెలిసింది. ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకునేందుకు భక్తులు సంబంధిత వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ బుకింగ్ చేసుకోవచ్చును.
 
ఆ వెబ్‌సైట్‌లో భక్తులు తమ పేరు, చిరునామా, ఫోటోను జత చేసి వర్చువల్ క్వ్యూ కార్డును రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ రిజిస్టర్ కార్డు, ఏదైనా గుర్తింపు కార్డును తీసుకుని సూచించిన టైం కంటే అర గంట ముందుగా  పంబకు వెళ్లినట్లైతే అక్కడ ఉన్న ప్రత్యేక కేంద్రంలో అధికారులు పరిశీలించి కొండపైకి ఎక్కేందుకు అనుమతిస్తారు.
 
ఈ విధానం ద్వారా ఒక గంట సేపటిలో ఆలయానికి చేరుకుని 18 మెట్లు ఎక్కి, అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవచ్చును. ఈ సేవ నవంబర్ 16వ తేది నుంచి డిసెంబర్ 27వ తేది వరకు అందుబాటులో ఉంటుంది. ఇంటర్నెట్ సౌకర్యం 2015 జనవరి నెలల జరిగే మకర దీప పూజ వరకు ఉంటుందని నిర్వాహకులు వెల్లడించారు. 

స్వాతి మలివాల్‌పై కేజ్రీవాల్ సహాయకుడి దాడి.. ఆ నొప్పిలో వున్నా?

రాత్రంతా మహిళతో మాట్లాడాడు.. రూ. 60 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు...

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

13-05-2024 సోమవారం దినఫలాలు - హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమం...

12-05-2024 ఆదివారం దినఫలాలు - మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం...

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

Show comments