Webdunia - Bharat's app for daily news and videos

Install App

యోగ అంటే ఏమిటి... దీని ద్వారా ఏం సాధించవచ్చు?

Webdunia
శుక్రవారం, 17 జులై 2020 (19:30 IST)
నేటికాలంలో యోగ అంటే శరీర వ్యాయామమని అందరికీ అభిప్రాయం ఏర్పడిపోయింది. అందరూ అటువంటి శారీరక వ్యాయామము గురుంచి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. కానీ నిజానికి యోగ అనేది కేవలం శరీరానికే సంబంధించినది కాదు. అది ముఖ్యంగా మనస్సుకు సంబంధించినది. మనస్సును నిగ్రహించడానికే మొట్టమొదటి యోగ పద్ధతి ప్రవేశపెట్టబడింది. ఇది అనేక వేల సంవత్సరాల క్రిందటే జరిగింది.
 
మనిషి అస్తిత్వంలో నాలుగు అంశాలు ఉన్నాయి. అవి దేహము, మనస్సు, బుద్ధి, ఆత్మ. మనిషి ఈ నాలుగింటిని ఆధారం చేసుకొని కర్మలు చేస్తాడు. మనిషి వీటిలో మూడవదైన బుద్ధి ద్వారానే కార్యాచరణ లేదా కార్యసాధన జరుగుతుంది. కానీ మనస్సు చంచలత కారణంగా బుద్ధి గతి తప్పి లక్ష్యసాధన తప్పిపోతుంది.
 
అందుకే భగవద్గీతలో గీతచార్యుడు యోగానికి ఒక నిర్వచనాన్ని చెప్పాడు. యోగః కర్మసు కౌశలమ్.. కర్మలో నేర్పరితనమే యోగము. యోగ వృద్ధులకే కానీ మాకెందుకు అని విద్యార్థులు, యువత అనుకునే అవకాశం ఉంది. మనస్సుపై ఏకాగ్రతను పెంచుకోవడానికి యోగా ఎంతైన అవసరము. ప్రస్తుత కాలంలో విద్యార్ధులకు మనస్సు ఏకాగ్రత ఎంతో అవసరం.
 
ఒక విద్యార్ధి చదువులో నూటికి నూరు మార్కులు సాధిస్తున్నాడంటే మనస్సును నిగ్రహించే ఆ కార్యాన్ని సాధించాడని చెప్పవచ్చు. సాధారణంగా యువత, విద్యార్థులను తప్పుదోవ పట్టించేవి ఇంటర్నెట్, వాట్సప్ సంభాషణలు, ఫేస్ బుక్‌లో కాలం గడపడం, వీడియోలు చూడటం, మత్తు పదార్ధాలకు అలవాటు పడటం. ముఖ్యంగా లక్ష్యం లేకపోవడం. ఇవన్నీ చంచలమైన మనస్సు ద్వారా కలిగేవి.
 
కానీ ఏ విద్యార్థియైనా చదువులో సంపూర్ణ విజయాన్ని సాధిస్తున్నాడంటే, మానసిక ప్రలోభాల నుండి అతడు బయటపడినట్లేనని తెలిసుకోవాలి. అప్పుడు అతడు పూర్తిగా బుద్ధి స్ధాయిలోనే ఉంటాడు. అతడు సాధించలేని కార్యమే ఉండదు. విద్యార్ధులకు, యువతకు తమ కార్యరంగంలో రాణించడమే యోగమౌతుంది. మన లక్ష్యసాధనకు అడ్డుపడే మనస్సును నిగ్రహించు కోవాలి. మనస్సును నిగ్రహించడం వలన ఉన్నత స్థితిని చేరుకోగలం. కర్మలను తగ్గించుకోవచ్చు.

సంబంధిత వార్తలు

ఏపీలో పోలింగ్ ప్రారంభం.. ఓటేసిన చంద్రబాబు, జగన్, లోకేశ్ దంపతులు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments