Webdunia - Bharat's app for daily news and videos

Install App

చింత గింజల పొడిని పాలతో తీసుకుంటే...

చింతపండును తీసుకుని చింత గింజలను పారవేస్తాం. కానీ చింత గింజలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. బాగా పండిన చింత కాయల నుంచి చింత పండును వేరు చేశాక.. చింత గింజలు లభ్యమవుతాయి. వీటిని సేక‌రించి ఒక బాణలిలో వేసి బాగా వేయించాలి. అనంత‌రం 2 రోజుల పాటు వాటిని నీ

Webdunia
బుధవారం, 9 ఆగస్టు 2017 (22:37 IST)
చింతపండును తీసుకుని చింత గింజలను పారవేస్తాం. కానీ చింత గింజలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. బాగా పండిన చింత కాయల నుంచి చింత పండును వేరు చేశాక.. చింత గింజలు లభ్యమవుతాయి. వీటిని సేక‌రించి ఒక బాణలిలో వేసి బాగా వేయించాలి. అనంత‌రం 2 రోజుల పాటు వాటిని నీటిలో నాన‌బెట్టాలి. రోజుకు రెండు సార్లు నీటిని మార్చాలి. 2 రోజుల త‌ర్వాత చింత గింజ‌ల‌ను తీసి వాటి పొట్టును వేరు చేయాలి. అనంత‌రం వ‌చ్చే విత్త‌నాల‌ను చిన్నచిన్న ముక్క‌లుగా చేసి ఆరబెట్టాలి. ఆ తర్వాత వాటిని మిక్సీలో వేసి చూర్ణంగా చేసుకోవాలి. 
 
ఈ పొడిని జార్‌లో నిల్వ ఉంచుకుని ప్రతి రోజూ అర టీస్పూన్ మోతాదులో రోజుకు రెండు సార్లు నీటితో లేదా పాల‌తో నెయ్యి లేదా చ‌క్కెర‌ను క‌లిపి తీసుకుంటే మోకాళ్ళ నొప్పుల నుంచి 3-4 వారాల్లో స‌మ‌స్య పూర్తిగా తగ్గుముఖం పడుతుందని ఆయుర్వేద వైద్యులు చెపుతున్నారు. ఎందుకంటే చింత గింజ‌ల్లో ఉండే ప‌లు ఔష‌ధ పదార్థాలు ఎముక‌ల‌కు బ‌లాన్నిస్తాయి. అదేవిధంగా కీళ్ల‌లో అరిగిపోయిన గుజ్జును మ‌ళ్లీ ఉత్పత్తి చేస్తాయి. 
 
ఈ చింత గింజల మిశ్ర‌మంతో కీళ్ల నొప్పులే కాదు డ‌యేరియా, చ‌ర్మంపై దుర‌ద‌లు, దంత సంబంధ స‌మ‌స్య‌లు, అజీర్ణం, రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉండ‌టం, ద‌గ్గు, గొంతు ఇన్‌ఫెక్ష‌న్లు, డ‌యాబెటిస్‌, గుండె సంబంధ వ్యాధులకు చ‌క్క‌ని ఔష‌ధంగా కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఎముక‌లు విరిగితే ఆ ప్ర‌దేశంపై రోజు చింత‌గింజ‌ల పొడిని పేస్ట్‌లా చేసి అప్లై చేయాలి. దీంతో ఎముక‌లు త్వ‌ర‌గా అతుక్కుంటాయి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments