Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో ఎన్ని లీటర్ల నీరు త్రాగాలో తెలుసా?

శరీరంపైన మలినాలను తొలగించేది జల స్నానం అయితే, శరీరం లోపలి మలినాలను కడిగి జీవక్రియలకు తోడ్పడేది జలపానం. ఈ పంచ భూతములలో గాలి తర్వాత స్థానం నీటిదే. మన శరీరంలో అన్నిటికంటే నీరే ఎక్కువ ప్రాధాన్యం కలిగి ఉంద

Webdunia
సోమవారం, 14 మే 2018 (12:45 IST)
శరీరంపైన మలినాలను తొలగించేది జల స్నానం అయితే, శరీరం లోపలి మలినాలను కడిగి జీవక్రియలకు తోడ్పడేది జలపానం. ఈ పంచ భూతములలో గాలి తర్వాత స్థానం నీటిదే. మన శరీరంలో అన్నిటికంటే నీరే ఎక్కువ ప్రాధాన్యం కలిగి ఉంది. చివరికి మనం నివశించే భూభాగంలోనూ మూడింతలు నీరే ఉంటాయి. అలాగే మన శరీరంలో కూడా దాదాపు 68 శాతం నీరు ఆక్రమించి వుంటే, కేవలం 32 శాతం మాత్రమే ఇతరాలు ఆక్రమించి ఉన్నాయి.  
 
కానీ ప్రస్తుత కాలంలో ఖరీదైన జీవితానికి అలవాటుపడిన మనిషికి నీటి ఆవశ్యకత తెలియక రోగాల పాలవుతున్నారు. నీటికి బదులు కూల్ డ్రింక్స్, హాట్ డ్రింక్స్,  తాగి లేనిపోని రోగాలను కొనితెచ్చుకుంటున్నారు. సాధారణంగా ఒక వంతు పదార్ధానికి మూడు వంతుల నీటిని పుచ్చుకోవడం శరీర ధర్మం. 
 
* పెద్దలు కనీసం ఐదు లీటర్ల నుంచి 6 లీటర్ల వరకు నీళ్లును తాగితే శరీరం సమతుల్యంగా ఉంటుంది.
* పిల్లల విషయానికొస్తే వారు 1 కేజీ నుండి 2 కేజీల వరకు ఆహారాన్ని తీసుకుంటారు కాబట్టి వారు రోజుకు 3 నుండి 4 లీటర్ల వరకు నీటిని తీసుకోవాలి.
* ఉదయం నిద్రలేచిన వెంటనే లీటరు నుండి లీటరున్నర వరకు నీళ్లను త్రాగాలి.
* నీళ్ళు తాగిన తర్వాత 20 నిమిషాల వరకు ఏ పదార్ధమూ తీసుకోకూడదు.
* ముఖ్యంగా ఎండాకాలంలో ఎక్కువగా నీటి పరిమాణం ఉండే పదార్ధాలను అంటే ఆకుకూర, పండ్లలో కూడా 70 నుంచి 80 శాతం వరకు నీరు ఉంటుంది కనుక వాటిని ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఎవరికాళ్లో మొక్కి మంత్రి పదవి తెచ్చుకోవాలనుకోవట్లేదు : కె.రాజగోపాల్ రెడ్డి

24 గంటల్లో భారత్‌కు మరో షాకిస్తాం : డోనాల్డ్ ట్రంప్

Bangladesh: ఐదు నెలల పాటు వ్యభిచార గృహంలో 12 ఏళ్ల బాలిక.. ఎలా రక్షించారంటే?

Pavitrotsavams: తిరుమలలో వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభం

ఆన్‌లైన్ బెట్టింగులు - అప్పులు తీర్చలేక పోస్టల్ ఉద్యోగి ఆత్మహత్య

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అడివి శేష్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ G2 డేట్ ఫిక్స్

త్రిబాణధారి బార్బరిక్ ప్రమోషన్ లో చిరంజీవి కంప్లీట్ యాక్టర్.. నసత్య రాజ్ కితాబు

ఓలే ఓలే.. అంటూ మాస్ జాతర సాంగ్ తో ఆకట్టుకున్న రవితేజ, శ్రీలీల జోడి

తర్వాతి కథనం
Show comments