ఖర్జూరాన్ని పాలల్లో నానబెట్టి తింటే చక్కగా నిద్రపడుతుంది...(video)

Webdunia
బుధవారం, 9 అక్టోబరు 2019 (12:32 IST)
ఖర్జూరాలను తీసుకోవడం వల్ల ఆరోగ్యపరంగా చాలా లాభాలు ఉన్నాయి. వీటిల్లో కొలెస్ట్రాల్ ఉండదు. అలాగే కొవ్వు శాతం కూడా తక్కువే. పైగా తక్షణ శక్తి లభిస్తుంది. ఇవి ఇంకెలా మేలు చేస్తాయంటే..
 
ఖర్జూరాల్లో పొటాషియం, క్యాల్షియం ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఆ పోషకాలు ఎముకలను మేలు చేస్తాయి. చెడు కొలస్ట్రాల్‌‌‌ను తగ్గిస్తాయి. అసిడిటీని అదుపులో ఉంచుతాయి. వీటిల్లోని పీచు అరుగుదలకు సాయపడుతుంది. ఖర్జూరాన్ని పాలల్లో నానబెట్టి తింటే చక్కగా నిద్రపడుతుంది.
 
ఎండు ఖర్జూరాలను రాత్రంతా నానబెట్టి ఉదయం ఏవైనా పండ్లతోపాటు తీసుకుంటే మలబద్ధకం సమస్య దరిచేరదు. బరువు పెరగాలనుకునే వారికి ఇది చక్కటి ఆహారం. వీటిలో ఇనుము శాతం కూడా ఎక్కువే. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తహీనత దరిచేరదు.
 
విటమిన్లు, ఖనిజాలు మాంసకృత్తులు ఖర్జూరాల్లో సమృద్ధిగా లభిస్తాయి. రోజూ కనీసం నాలుగైదు తీసుకోవాలి. తీసుకున్న వెంటనే తక్షణ శక్తి అందుతుంది. అలసట దూరమవుతుంది. అందుకు ఖర్జూరాల్లోని గ్లూకోజ్, సుక్రోజ్, ఫ్రక్టోజ్‌‌‌లు కారణం.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పుట్టపర్తిలో ప్రధాని మోడి పాదాలకు నమస్కరించిన ఐశ్వర్యా రాయ్ (video)

తమిళనాడులో డిజిటల్, స్టెమ్ విద్యను బలోపేతం చేయడానికి సామ్‌సంగ్ డిజిఅరివు కార్యక్రమం

తెలంగాణలో ఒకటి, భారత్‌వ్యాప్తంగా 10 అంబులెన్స్‌లను విరాళంగా అందించిన బంధన్ బ్యాంక్

శీతాకాలంలో సైబరాబాద్ సరిహద్దుల్లో జాగ్రత్త.. వాహనదారులకు మార్గదర్శకాలు జారీ

మావోయిస్టు అగ్రనేత హిడ్మాది ఎన్‌కౌంటర్ కాదు... హత్య : సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కౌబాయ్ చిత్రంలో నటిస్తానని ఊహించలేదు : చిరంజీవి

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

తర్వాతి కథనం
Show comments