Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎండు నల్ల ద్రాక్షలను రాత్రి నానబెట్టి ఉదయాన్నే పరగడపున తింటే?

Webdunia
బుధవారం, 24 మే 2023 (18:32 IST)
ఎండు నల్లద్రాక్ష. వీటిలో యాంటీఆక్సిడెంట్లతో పాటు ఐరన్ పుష్కలంగా వుంటుంది. అందువల్ల రక్తహీనత సమస్యతో బాధపడేవారు వీటిని తింటుంటే ఎర్ర రక్తకణాలు ఉత్పత్తి చేయడంలో సాయపడతాయి. ఇంకా ఎండు నల్ల ద్రాక్షను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. రాత్రిపూట పది ఎండు నల్లద్రాక్షలను మంచినీటిలో నానబెట్టి ఉదయాన్నే వాటిని పరగడుపున తింటే రక్తహీనత తగ్గుతుంది. నల్ల ఎండు ద్రాక్ష తింటుంటే శరీరానికి విటమిన్ సి అందుతుంది, ఫలితంగా కేశాలు బలంగా వుంటాయి.
 
తరచూ ఎండు ద్రాక్ష తింటుంటే రక్తంలో సోడియం మోతాదులు తగ్గుతూ రక్తపోటు అదుపులో వుంటుంది. ఎండు ద్రాక్షలో వున్న యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్ వల్ల అవి తినేవారి చర్మం నిగనిగలాడుతుంది. నల్ల ఎండు ద్రాక్షలో క్యాల్షియం వుంటుంది, అందువల్ల అవి తింటే ఎముకలు దృఢంగా పెళుసుబారకుండా వుంటాయి. నల్ల ఎండు ద్రాక్ష కొలెస్ట్రాల్ తగ్గించడంలో సాయపడుతుంది. తద్వారా గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
 
నల్ల ఎండు ద్రాక్ష తింటే మహిళల్లో నెలసరి సమయంలో వచ్చే నొప్పి తగ్గుతుంది. ఛాతీలో మంట, అజీర్ణం తగ్గాలంటే నల్ల ఎండుద్రాక్షను తింటుండాలి.

సంబంధిత వార్తలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు.. లక్షల్లో లావాదేవీలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

తర్వాతి కథనం
Show comments