డయాబెటిస్ సమస్య వున్నవారు ఇవి పాటిస్తే చాలంతే...

సాధారణంగా మధుమేహంతో బాధపడేవారు రకరకాల మందులను వాడుతుంటారు. ఈ మందులను దీర్ఘకాలంగా వాడటం వలన కొన్నాళ్లకు సైడ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంది కనుక వీరు తినే ఆహారంలో మార్పు చేసుకోవటం వలన మంచి ప్రయోజనం ఉంటుంది. అది ఎలాగో చూద్దాం.

Webdunia
మంగళవారం, 21 ఆగస్టు 2018 (23:03 IST)
సాధారణంగా మధుమేహంతో బాధపడేవారు రకరకాల మందులను వాడుతుంటారు. ఈ మందులను దీర్ఘకాలంగా వాడటం వలన కొన్నాళ్లకు సైడ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంది కనుక వీరు తినే ఆహారంలో మార్పు చేసుకోవటం వలన మంచి ప్రయోజనం ఉంటుంది. అది ఎలాగో చూద్దాం.
 
1. మన శరీరానికి  నీరు చాలా అవసరం.  ముఖ్యంగా మధుమేహం ఉన్నవాళ్లలో ఒంట్లో నీరు తగ్గిపోతే  తీవ్రమైన అనారోగ్య సమస్య వస్తుంది. కనుక వీరు సాధ్యమైనంత ఎక్కువుగా నీరు తాగుతూ ఉండాలి.
 
2. పాలు, పెరుగు వంటి పాల పదార్ధాలను తీసుకోవచ్చు గానీ కొవ్వు ఎక్కువుగా ఉండే బటర్, చీజ్, నెయ్యిలకు దూరంగా ఉండటం మంచిది.
 
3. రోజుకి కనీసం మూడు సార్లయినా తాజా కూరగాయలు తీసుకోవాలి. క్యాబేజీ, పుదీనా, పాలకూర, కాకరకాయ, బెండకాయ, కాలీఫ్లవర్, దోసకాయ, క్యారెట్, ముల్లంగి, ఉల్లికాడలు, గుమ్మడికాయ మధుమేహులకు ఎంతో మేలు చేస్తాయి.
 
4. తాజా పండ్లు తినటమూ మంచిదే. వీటిలో సహజంగా ఉండే చక్కెర సుక్రోజ్ కన్నా నెమ్మదిగా రక్తంలో కలుస్తుంది. అయితే చాలా తీయగా ఉండే మామిడి, అరటి వంటివి తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఇలాంటి పండ్లను భోజనం చేసిన వెంటనే తింటే రక్తంలో గ్లూకోజ్ త్వరగా పెరుగుతుంది. 
 
5. మధుమేహం ఉన్న వాళ్లు ఎట్టి పరిస్ధితులలోను ఆహారం తినటాన్ని మానేయటం మంచిదికాదు. ప్రతిరోజు ఒకే సమయంలో భోజనం చేయటం వల్ల రక్తంలో చక్కెర స్థిరంగా ఉండేందుకు దోహదం చేస్తుంది.
 
6. కేకులు, మిఠాయిలు, చాక్లెట్లు వంటి అధిక చక్కెర గల పదార్ధాలకు దూరంగా ఉండాలి. తీయటి పానీయాల జోలికి వెళ్లకపోవటం మంచిది.
 
7. ఎక్కువ నూనెతో వేయించే పదార్ధాలకన్నా ఉడికించినవి తినటం ఎంతో మంచిది. అలాగే అన్నం, ఆలుగడ్డ, అరటి వంటివి రక్తంలో గ్లూకోజ్ శాతాన్ని పెంచుతాయి. కాబట్టి ఇలాంటివి పెద్దమెుత్తంలో తినకుండా చూసుకోవాలి.
 
8. మధుమేహులకు రక్తపోటు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఆహారంలో ఉప్పు తగ్గించుకోవటం అన్ని విధాలా మంచిది. 
 
9. అన్నింటికన్నా ముఖ్యంగా రోజులో ఎప్పుడైనా సరే .. ఆహారాన్ని ఒకేసారి పెద్దమెుత్తంలో తినకుండా జాగ్రత్తపడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

సెలవుపై ఇంటికొచ్చి.. ఇంకోదానితో కులుకుతావా..? ఆర్మీ జవాన్‌ను హత్య చేసిన భార్య?

రైల్వే వంతెనను ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. 15 మందికి గాయాలు.. మరో ముగ్గురు యాత్రికులు...?

తండ్రి నీడలోనే ఉన్న వ్యక్తిలా కనిపిస్తున్న నారా లోకేష్.. కడియం శ్రీహరి

ఢిల్లీ యూనివర్శిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ దారుణ హత్య.. కారణం ఎవరంటే?

జూన్ 12 నుంచి కాదు.. జూన్ 15 నుంచి స్కూల్స్ పునః ప్రారంభం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi contravercy : రాంచరణ్ పెద్ది మూవీ పై స్పందించని ప్రముఖులు, దర్శకుడు క్షమాపణ ?

Sunitha: గాయని సునీత తనయుడు ఆకాష్ కు కొత్త మలుపు అవుతుందా..

Ravi Teja: కూతురి కోసం తండ్రిగా ఇరుముడి వేసుకున్న రవితేజ ఏం చేశాడు

Boyapati Srinu: భోళా బాలయ్య సాంగ్ అద్భుతంగా ఉంది : డైరెక్టర్ బోయపాటి శ్రీను

Trisha: త్రిషకు పెళ్లైందా... మెడలో ఆ మంగళసూత్రం ఏంటి... ఎవరు కట్టారు?

తర్వాతి కథనం
Show comments