ఎసిడిటి పోవాలంటే ఏం చేయాలి?

ఎసిడిటి... ఈ సమస్య చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళు వరకు అందరూ ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య నుండి బయట పడాలి అంటే కొన్ని నియమాలు పాటించాలి. ఇదివరకు భోజనం తిన్న తరువాత ఒక బెల్లం ముక్కను నోట్లో వేసుకునేవారు పెద్దలు. ఇప్పటి తరానికి ఆ అలవాటు పోయింది. కానీ బెల్ల

Webdunia
మంగళవారం, 12 డిశెంబరు 2017 (21:43 IST)
ఎసిడిటి... ఈ సమస్య చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళు వరకు అందరూ ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య నుండి బయట పడాలి అంటే కొన్ని నియమాలు పాటించాలి. ఇదివరకు భోజనం తిన్న తరువాత ఒక బెల్లం ముక్కను నోట్లో వేసుకునేవారు పెద్దలు. ఇప్పటి తరానికి ఆ అలవాటు పోయింది. కానీ బెల్లం వల్ల గ్యాస్ ఎంతగానో తగ్గుతుంది. బెల్లం లోని మెగ్నీషియం ఎంతో మేలు చేస్తుంది. కాల్షియం కూడా లభిస్తుంది. రాత్రి భోజనం తరువాత నిద్రకు ఉపక్రమించే ముందు ఒక గ్లాసు గోరు వెచ్చని మంచినీళ్ళు తాగండి. మళ్ళీఉదయాన్నే నిద్రలేస్తునే పరగడుపున ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళు త్రాగండి. ఉపశమనం లభిస్తుంది. 
 
ఒక్కోసారి ఉదరంలో పుట్టుకొచ్చే ఎసిడిటీ చాలా ఇబ్బందులకు గురిచేస్తుంది. ఏమి చేసినా ఒక పట్టాన తగ్గదు. అలాంటి పరిస్థితుల్లో బాగా మాగిన అరటిపండు తినండి. అందులోని పొటాషియం ఎసిడిటీని తగ్గిస్తుంది. కడుపులో ఇబ్బందులు తొలుగుతాయి. అంతేకాదు కాచి చల్లార్చిన గ్లాసుడు పాలలోకి ఒక స్పూన్ తేనె కలుపు కొని తాగండి.
 
పాలలోకి అలవాటు ప్రకారం పంచదార లేదా బెల్లం అలాంటివేమి కలుపుకోకూడదు. ఒక కప్పు నీటిని మరగనివ్వండి. అందులో ఒక టేబుల్ స్పూన్ సోంపు వేసి కాసేపు ఆ పాత్రకు మూతపెట్టి రాత్రంతా అలాగే ఉండనివ్వండి. ఆ నీటికి ఒక స్పూన్ తేనె కలుపుకొని తాగండి. అలా రోజుకు మూడుపూటలా తాగితే ఎసిడిటికి పరిష్కారం లభించినట్లే.
 
పచ్చటి తులసి ఆకుల్ని వేడి నీటిలో మరగనివ్వండి. తరువాత వాటిని చల్లార్చి సేవించండి. రోజూ అలా చేస్తే వారం, పదిరోజులలో గ్యాస్ కొంతవరకైన తగ్గుతుంది. ఈ రసం వలన దగ్గు, జలుబు కూడా నివారించవచ్చు. మనం రోజూ తీసుకునే మజ్జిగలోని లాక్టిక్ ఆసిడ్ కడుపులోని గ్యాస్‌కు కళ్లెం వేస్తుంది. 
 
ఆయుర్వేద శాస్త్రం ప్రకారం గ్యాస్‌కు మజ్జిగ మంచిది. మసాల దినుసులతో భోజనం చేసినపుడు మజ్జిగ తీసుకోవడం మరవవద్దు. కడుపుబ్బరం తక్షణ సమస్యకు చక్కటి పరిష్కారం రోజు తాజా కొబ్బరి బోండం తాగడం గ్యాస్‌కు ఉపశమనంతో పాటు శరీరానికి వెంటనే శక్తి వస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

జూన్ 24, 2026 తెలుగు రాష్ట్రాల వెదర్ రిపోర్ట్ ఎలా వుంది..?

హార్మూజ్ జలసంధిని తెరిచారు: పిచ్చిపట్టినట్లు చమురు నౌకలు పరుగులు, ఒక్కరోజే 1.9 కోట్ల బ్యారెళ్లు

భాస్కర్ వర్మ సేతు బ్రిడ్జిపై భార్య బర్త్ డే వేడుకలు.. గౌహతి వ్యాపారవేత్త అరెస్ట్ (video)

రూ.17 లక్షలతో పరారైన ఏటీఎం వ్యాన్ డ్రైవర్.. ఎక్కడ? (video)

ప్రజల కోసం సీఎం విజయ్ నటి త్రిషను పక్కన పెట్టేసారా? అన్‌ఫాలో చేసిన చెన్నై బ్యూటీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Trisha: అభిమానులు గోల చేసాక విజయ్‌కు విషెస్ చెప్పిన త్రిష

Ramcharan and modi: న్యూఢిల్లీలో రిపబ్లిక్ సమ్మిట్‌లో మోదీతో రామ్ చరణ్, అనిల్ కపూర్

Manchu Lakshmi: క్రియేటర్స్ కు ఇన్ఫ్లుయెన్సర్స్ కు మధ్య తేడా ఉంది :మంచు లక్ష్మి

సినిమా అనేది చౌకైన వినోద సాధనం, పాప్‌కార్న్, స్నాక్స్ ధరలు తగ్గితే? చెర్రీ

సెన్సార్ తో కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది, రోజు రోజుకూ కలెక్లన్లు పెరుగుతున్నాయి : దీవాన నిర్మాతలు

తర్వాతి కథనం
Show comments