అధిక బరువుకు వంద గ్రాముల గుగ్గిళ్లు.. నువ్వుల కారం..

Webdunia
శుక్రవారం, 8 జులై 2022 (19:25 IST)
అధిక బరువును తగ్గించాలనుకుంటున్నారా? అయితే ఈ చిట్కాలు పాటించండి. అధిక బరువును తగ్గించుకోవాలంటే రోజూ ఉదయం వంద గ్రాముల ఉలవ గుగ్గిళ్లు తీసుకుంటే సన్నబడతారు. 
 
అలాగే పచ్చి బొప్పాయి కూర  వండుకుని తినడం ద్వారా ఒంట్లో చెడు నీరు తొలగిపోతుంది. అలాగే నువ్వుల కారం బరువును తగ్గిస్తుంది. దీన్ని వాడితే ఒంట్లో వాతం, శరీరంలో చెడు నీరు తొలగిపోతుంది.
 
తిప్పతీగ పొడి, త్రిఫలం చూర్ణం సమానంగా తీసుకుని ఒక చెంచా తీసుకుని ఒక గ్లాసు నీళ్ళతో కషాయంగా ఒక చెంచా తేనెతో తీసుకుంటే ఒంట్లో వున్న కొవ్వు కరిగి ఒంటి నొప్పులు తగ్గుతాయి.
 
మునగ చెట్టు బెరడు 20 గ్రాములు, అర లీటరు నీటిలో వేసి పావు లీటరు కషాయం వచ్చేంత వరకు మరిగించి అందులో దోరగా వేయించిన చిత్రమూలం పొడి 1 గ్రాము, పిప్పలి చూర్ణం 2 గ్రాములు, సైంధవ లవణం 3 గ్రాములు కలిపి తాగుతూ వుంటే కుండలాగా వున్న పొట్ట తగ్గిపోతుంది. 
 
ఇంకా ఎన్నో తరాల నుంచి నువ్వుల కారం వాడకం మనకు చాలా అలవాటే. దీన్ని ఆహారంలో చేర్చుకుంటే వాతం తగ్గిపోతుంది. బరువు పెరగరు. 
 
శొంఠి, మిరియాలు, సైంధవ లవణం, పిప్పళ్లు, వాము, జీలకర్ర సమ భాగాలుగా చూర్ణాన్ని మూడు వేళ్లకు వచ్చినంత చూర్ణాన్ని పావు లీటరు ఆవు మజ్జిగలో కలుపుకుని రెండు పూటలా తీసుకుంటే పొట్ట తగ్గుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రయత్నాలు విఫలమైనా ప్రార్థనలు ఎన్నిటికీ విఫలం కావు : డీకే శివకుమార్

శాంతి, సామరస్యం ఉన్నచోట రోజూ పండుగే : పవన్ కళ్యాణ్

ఎన్డీయేతో జట్టు కట్టే ప్రసక్తే లేదు : విజయ్ పార్టీ నేత స్పష్టీకరణ

భోగి పండుగ - పొంగలి తయారు చేసిన ప్రధాని మోడీ

కారుతో బీభత్సం కేసు : రౌడీ షీటర్లకు ఖాకీ మార్క్ ట్రీట్మెంట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జూమ్ కాల్‌లో బోరున విలపించిన యాంకర్ అనసూయ

బాక్సాఫీస్ వద్ద 'మన శంకరవరప్రసాద్ గారు' దూకుడు

ఒక వర్గానికి చెందిన అభిమానులు పరాశక్తిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : దర్శకురాలు సుధా కొంగరా

Anasuya: పోలీసులను ఆశ్రయించిన అనసూయ.. 42 మందిపై ఫిర్యాదు.. ఎందుకో తెలుసా?

మన శంకర వర ప్రసాద్ గారులో రాసిన ప్రతి సీన్‌కి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారే : అనిల్ రావిపూడి

తర్వాతి కథనం
Show comments