వెల్లుల్లి రసం, పావుగ్లాసు గోరు వెచ్చని పాలల్లో కలిపి తీసుకుంటే?

Webdunia
సోమవారం, 12 ఆగస్టు 2019 (21:10 IST)
ఈ రోజుల్లో చాలామంది నడుము నొప్పి సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా మహిళల సంగతి వేరే చెప్పక్కర్లేదు. ఇంటిపని, ఆఫీసు పని చేస్తూ పలు ఆరోగ్య సమస్యలతో సతమతమవుతుంటారు. మహిళలు తరచూ నడుము నొప్పితో బాధపడుతుంటారు. అలాంటివారు ఈ చిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.
 
1. ప్రతిరోజూ పది చుక్కలు వెల్లుల్లి రసం, పావుగ్లాసు గోరు వెచ్చని పాలల్లో కలిపి తీసుకుంటే, నడుం నొప్పి తగ్గుతుంది. అల్లంరసం, పసుపు కలిపి పాలతో తీసుకుంటే జీర్ణకోశం బాగుపడి నడుంనొప్పి తగ్గుతుంది. ఆవనూనె, నువ్వుల నూనె వేడిచేసి నడుముకు మర్ధనచేసుకుని వేడి నీళ్ళతో స్నానం చేస్తే, నడుంనొప్పి తగ్గుతుంది. 
 
2. ఒళ్ళు లావుగా ఉండి నడుంనొప్పి వుంటే, పావు గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో ఇరవై చుక్కలు నిమ్మపండు రసం పోసి పరగడుపున తాగితే, ఒళ్లు తేలికపడి నొప్పి తగ్గుతుంది. ఒక నిమ్మకాయ కోసి ఒక చెక్కను పల్చటి గుడ్డలో కట్టి, మూకుడులో ఆవునెయ్యి వేసి కాచి అందులో ఈ కట్టిన గుడ్డను ముంచి నడుం చుట్టూ కాపు పెడుతుంటే నడుంనొప్పి తగ్గిపోతుంది. 
 
3. వెల్లుల్లిపాయలు నాలుగు ఒక చెంచా నువ్వుల నూనెలో వేయించి, అందులో సైంధవ లవణం కలిపి తింటుంటే నడుం నొప్పి తగ్గిపోతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

క్వాంటం వ్యాలీ, గ్రీన్ హైడ్రోజన్ ఏపీకి దీర్ఘకాలిక గేమ్ ఛేంజర్‌లుగా ఉంటాయి: చంద్రబాబు

తిరుమలకు సరఫరా చేసే నెయ్యిలో కొరియన్ మోనోగ్లిజరైడ్స్.. సిట్ విచారణలో వెల్లడి

కూనో జాతీయ పార్కులో ఐదు కూనలకు జన్మనిచ్చిన ఆశా చిరుత

Jogi Ramesh: జోగి రమేష్‌పై మరోసారి నాన్ బెయిలబుల్ కేసు

తిరుమల శ్రీవారి లడ్డూల్లో రెండు రోజుల్లోనే దుర్వాసన.. జాతీయ జర్నలిస్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

యాక్షన్ కింగ్ అర్జున్ పవర్ ఫుల్ ఎంట్రీ తో సీతా పయనం ట్రైలర్ రిలీజ్

కన్నీరు పెట్టుకున్న చంద్రహాస్ - చేసిన తప్పును ఎక్కువ చేయకండి : ప్రభాకర్

Rashmika Mandanna: బాలీవుడ్‌లో బిజీ అవుతున్న రష్మిక మందన్న.. చేతినిండా సినీ అవకాశాలు

మమ్ముట్టి నటించిన మలయాళీ చథా పచ్చ తెలుగులో రాబోతోంది

funky: విశ్వక్ సేన్ తో కె.వి. అనుదీప్ శైలి కామెడీతో ఫంకీ ట్రైలర్

తర్వాతి కథనం
Show comments