రక్తంలో కలిసిపోయిన క్రొవ్వును కరిగించడం ఎంత సుళువో తెలుసా?

మనం చాలావరకు వెల్లుల్లి, నిమ్మరసాలను వంటల్లో మసాలా కోసమో... లేకుంటే మంచి రుచి వచ్చేందుకు మాత్రమే వాడుతుంటాం. కానీ ఈ రెండు కలిపితే శరీరానికి గొప్ప ఫలితాలు వస్తాయని చాలామందికి తెలియదు. రక్తనాళాల్లో ఎక్కువగా పేరుకు పోయిన కొలెస్ట్రాల్ కరిగించేందుకు ఫార్మ

Webdunia
శుక్రవారం, 21 జులై 2017 (19:21 IST)
మనం చాలావరకు వెల్లుల్లి, నిమ్మరసాలను వంటల్లో మసాలా కోసమో... లేకుంటే మంచి రుచి వచ్చేందుకు మాత్రమే వాడుతుంటాం. కానీ ఈ రెండు కలిపితే శరీరానికి గొప్ప ఫలితాలు వస్తాయని చాలామందికి తెలియదు. రక్తనాళాల్లో ఎక్కువగా పేరుకు పోయిన కొలెస్ట్రాల్ కరిగించేందుకు ఫార్మా కంపెనీలు తయారుచేసే మందుల్లో ఉండే పదార్థాలు కూడా ఇవే. రసాయనిక చర్యతో తయారైన మందులు ఎందుకు వాడాలి. సహజసిద్ధంగా ఆ రెండింటిని కలుపుకుని మనమే తాగితే రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. దీంతో సరఫరా మెరుగవుతుంది. 
 
గుండె సంబంధిత సమస్యల నుంచి దీర్ఘాయుష్షు పొందవచ్చు. ఇప్పటికే గుండె జబ్బు ఉన్నవారు ఈ మిశ్రమాన్ని తాగితే గుండెనొప్పి రాదు. ఆ తరువాత జబ్బులే రావు. అధిక బరువు ఉన్నవారు ఈ మిశ్రమాన్ని తాగితే చాలా మంచిది. 30 వెల్లుల్లి రెబ్బలు, ఆరు నిమ్మకాయలు తీసుకోవాలి. నిమ్మకాయలను కోసి రసం తీయాలి. వెల్లుల్లి పొట్టు తీసేసి ముక్కులుగా కోయాలి. తరువాత కొద్దిగా నీళ్ళు పోసుకుని రెండింటిని మిక్సీ పట్టాలి. మిక్సీ తరువాత రెండు లీటర్ల నీటిని కలపాలి. తరువాత వచ్చే మిశ్రమాన్ని ఐదు నుంచి పది నిమిషాలు వేడి చేయాలి.
 
ఆ తరువాత వడగట్టి గాజు సీసాలో ఉంచి ఫ్రిజ్‌లో ఉంచాలి. ప్రతిరోజు ఈ మిశ్రమాన్ని 50 ఎం.ఎల్. చొప్పున ఉదయం పరగడుపున తాగాలి. ఇలా మూడు వారాలు క్రమం తప్పకుండా తీసుకోవాలి. తిరిగి వారం రోజులు గ్యాప్ ఇవ్వాలి. మళ్ళీ మూడువారాలు తాగాలి. ఇలా ప్రతి ఆరు నెలలు చేస్తే, గుండెకు రక్తాన్ని పంపిణీ  చేసే నాళాల్లో క్రొవ్వు కరిగిపోతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఉడుపి క్షేత్రాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్ - ఈ పవిత్ర భూమిలో అడుగుపెట్టడం... (వీడియో)

గోవా నైట్ క్లబ్‌లో విషాదం - 25 మంది అగ్నికి ఆహుతి

ముఖ్యమంత్రి అభ్యర్థిగా సిద్ధూ పేరును ప్రకటించాలి : నవజ్యోతి కౌర్ సిద్ధూ

సింహాచలంలో విరాట్ కోహ్లీ సందడి.. సింహాద్రి అప్పన్నకు ప్రత్యేక పూజలు

పెళ్లికి ముందు ప్రియుడితో గోవా హోటల్‌లో యువతి ఎంజాయ్.. ఇపుడు వీడియోలతో బ్లాక్‌మెయిల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

థర్డ్ పార్టీల వల్లే సినిమాల విడుదలకు బ్రేక్ - యధావిధిగా ది రాజాసాబ్‌ రిలీజ్ : నిర్మాత విశ్వప్రసాద్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

తర్వాతి కథనం
Show comments