Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేసవిలో కొబ్బరి బొండాం.. మజ్జిగ తాగితే జలుబు చేస్తుందా?

వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. ఈ వేడి తాపాన్ని దాహాన్ని తీర్చడం కోసం నీరు ఎక్కువగా తీసుకోవడంతో పాటు పుచ్చకాయ, కర్బూజ వంటి నీటి శాతం ఎక్కువ గల పండ్లను తీసుకోవాలి. వేసవిలో కొబ్బరిబొండాం, మజ్జిగ, నిమ్మరస

Webdunia
మంగళవారం, 18 ఏప్రియల్ 2017 (14:53 IST)
వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. ఈ  వేడి తాపాన్ని దాహాన్ని తీర్చడం కోసం నీరు ఎక్కువగా తీసుకోవడంతో పాటు పుచ్చకాయ, కర్బూజ వంటి నీటి శాతం ఎక్కువ గల పండ్లను తీసుకోవాలి. వేసవిలో కొబ్బరిబొండాం, మజ్జిగ, నిమ్మరసం వంటివి తీసుకోవడం ద్వారా శరీరానికి మేలు చేస్తాయి.

పండ్ల రసాల ద్వారా తీసుకోకుండా.. పండ్లను అలాగే తినడం మంచిది. తద్వారా పండ్ల మేలు రెట్టింపు అవుతుంది. వేసవిలో నీటితో పాటు నిమ్మరసంలో తేనె, పంచదార, చిటికెడు ఉప్పు కలిపి సేవిస్తే దాహం తీరుతుంది.
 
వేసవిలో చర్మ సంరక్షణకు గంధం, శెనగపిండి, పెసర పిండిని సమపాళ్లలో తీసుకుని పేస్టులా ఒళ్లంతా రాసుకుని 15 నిమిషాల తర్వాత స్నానం చేయాలి. తద్వారా చర్మ రుగ్మతల నుంచి ఉపశమనం పొందవచ్చు. వేసవిలో తడి బట్టలను ధరించకూడదు. కాటన్ దుస్తుల్నే ధరించాలి.

ఉదయం, సాయంత్రం రెండు పూటలా స్నానం చేయాలి. వారంలో రెండు రోజులు తలంటు స్నానం చేయాలి. రోజు మార్చి రోజు రాత్రిపూట మెంతుల్ని నానబెట్టి.. ఉదయం పూట పేస్టులా చేసి తలకు పట్టించాలి. అరగంట తర్వాత తలస్నానం చేయాలి.
 
వేసవిలో కొందరికి కొబ్బరి బొండాం, మజ్జిగ తాగితే జలుబు చేస్తుంది. అలాంటి వారు చిటికెడు మిరియాల పొడిని చేర్చి తీసుకుంటే.. జలుబు ఉండదు. ముల్లంగి, క్యారెట్, బీట్‌రూట్, కీరదోస, అరటికాడ, గుమ్మడి, పొట్లకాయ వంటి కూరగాయలను సలాడ్ల రూపంలో తీసుకోవాలి.

సలాడ్లలో ఉప్పు, మిరియాల పొడి చిటికెడు చేర్చుకోవచ్చు. వేసవిలో వేడి ఎక్కువైతే.. జీలకర్ర, మెంతుల పొడిని మజ్జిగలో కలుపుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఉదయం పూట రాగి, సజ్జలు, మొక్కజొన్న, గోధుమ, బార్లీ పిండితో తయారైన జావను తాగడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని వారు చెప్తున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Santhanam: డీడీ నెక్ట్స్ లెవల్: రోడ్డున పోయే ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదు..

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

తర్వాతి కథనం
Show comments