Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ సీజన్‌లో దొరికే రేగిపండ్లు తీసుకుంటే..?

Webdunia
మంగళవారం, 11 డిశెంబరు 2018 (10:22 IST)
శీతాకాలంలో రేగిపండ్లు చాలా విరివిగా దొరుకుతాయి. వీటి రుచి చాలా బాగుంటుంది. రేగిపండ్లంటే ఇష్టపడి తినేవారు చాలామంది. రేగిపండ్లు ఈ సీజన్‌లో తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఓసారి తెలుసుకుందాం..
 
1. హైబీపీతో బాధపడేవారు ఈ సీజన్‌లో దొరికే రేగిపండ్లు తీసుకుంటే బీపీని అదుపు చేయవచ్చని చెప్తున్నారు నిపుణులు. తరచు ఈ పండ్లు తీసుకుంటే రక్తప్రసరణ సజావుగా జరుగుతుంది. దాంతో రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుముఖం పడుతుంది. 
 
2. రేగిపండ్లలోని క్యాల్షియం ఎముకలను బలంగా చేస్తుంది. చాలామంది స్త్రీలకు రుతు సమయంలో వచ్చే నొప్పులతో సతమతమవుతుంటారు. ఈ నొప్పులు తగ్గించాలంటే.. రేగిపండ్ల గింజలను ఎండబెట్టుకుని పొడి చేసుకోవాలి. ఇలా చేసిన పొడిలో కొద్దిగా ఉప్పు, పెరుగు కలిపి తీసుకుంటే నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.
 
3.  రేగిపండ్లలోని గుజ్జును తీసి అందులో కొద్దిగా ఉప్పు, కారం కలిపి తీసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. ఈ చేసిన మిశ్రమాన్ని క్రమంగా తీసుకుంటే జీర్ణవ్యవస్థ పనితీరును సాఫీగా సాగుతుంది.  
 
4. రేగిపండ్లు తీసుకోవడం వలన చర్మం సురక్షితంగా ఉంటుంది. జిడ్డు చర్మానికి రేగిపండ్లు చాలా దోహదపడుతాయి. రేగిపండ్ల గింజలను వేరుచేసి దాని నుండి వచ్చే గుజ్జును మాత్రం తీసుకుని అందులో కొద్దిగా తేనె, కలబంద గుజ్జు కలిపి ముఖానికి రాసుకుంటే జిడ్డు చర్మం పోయి ముఖం తాజాగా మారుతుంది. 
 
5. రేగిపండ్లలోని ఫైబర్ ఆకలి నియంత్రణకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. తద్వారా బరువును కూడా తగ్గించుకోవచ్చును. రక్తహీనతతో బాధపడేవారు రేగి పండ్లను తింటే మంచిది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వరంగల్ యువత రోడ్ల ప్రవర్తన మార్చడంలో ముందడుగు

Sanam Shetty: పారిశుద్ధ్య కార్మికులతో సనమ్ శెట్టి నిరసన.. చిన్మయి, విజయ్‌కి తర్వాత? (Video)

Praja Rajyam: ప్రజా రాజ్యం, జనసేన పార్టీలను తొలగించిన ఈసీ.. నిజమేనా?

హైటెక్ భారతంలో అంబులెన్స్‌కు కరువాయె ... భార్య మృతదేహాన్ని బైకుకు కట్టి...

డిమాండ్ల పరిష్కారం కోసం షూటింగ్ బంద్ సబబు కాదు : మంత్రి కోమటిరెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

నా కోసం ప్రభుత్వ వాహనం పంపలేదు... దానికి నాకూ ఎలాంటి సంబంధం లేదు : నిధి అగర్వాల్

ప్రభుత్వ వాహనంలో నిధి అగర్వాల్.. క్లారిటీ ఇచ్చిన హరిహర వీరమల్లు హీరోయిన్

Madhu Shalini : మధు శాలిని ప్రెజెంట్స్ కన్యా కుమారి రిలీజ్ కు సిద్ధం

తర్వాతి కథనం
Show comments