Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడుపుకి నిత్యం ఇవి పట్టిస్తుంటే ఇక సుఖనిద్ర ఎలా వస్తుంది నాయనా?

నేటి జీవితంలో 8 గంటల పని తర్వాత ఇంటికి వచ్చి కాస్సేపు జీవన సహచరి లేదా సహచరుడితో, పిల్లలతో గడిపి హాయిగా నిద్రపోయే పరిస్థితులు కరువవుతున్నాయి. అందుకే నిద్ర సుఖమెరుగదు అని అలనాటి పెద్దలు అంటే సుఖనిద్రా.. అంటే ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు నేటి పెద్దలు. ప్

Webdunia
శుక్రవారం, 7 జులై 2017 (07:24 IST)
నేటి జీవితంలో 8 గంటల పని తర్వాత ఇంటికి వచ్చి కాస్సేపు జీవన సహచరి లేదా సహచరుడితో, పిల్లలతో గడిపి హాయిగా నిద్రపోయే పరిస్థితులు కరువవుతున్నాయి. అందుకే నిద్ర సుఖమెరుగదు అని అలనాటి పెద్దలు అంటే సుఖనిద్రా.. అంటే ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు నేటి పెద్దలు. ప్రపంచంలో ఏ దేశంలో అయినా సరే నింపాదితనానికి ఇప్పుడు చోటేలేదు. బతకడానికి డబ్బులు కావాలంటే నిద్రలేచింది మొదలు ఉరుకులు, పరుగులతో ఉద్యోగానికో, పనికో పరుగెత్తాల్సిందే. రోజువారీ లక్ష్యాలు, పేరుకుపోతున్న టార్కెట్ల సాధన మధ్య సరైన నిద్ర కోసం అల్లాడిపోవడమొకటే ఇప్పుడు జనాలకు బాగా తెలిసిన విషయం. 
 
అయితే ఇంత సంక్లిష్ట, సంక్షుభిత, వేగ జీవితంలో కూడా పడుకునే ముందు ఒకరకమైన ఆహార అలవాట్లు ఏర్పర్చుకుంటే హాయిగా నిద్రపోవచ్చని సమతుల ఆహార నిపుణులు చెబుతున్నారు. మనిషి నిద్రకు ఉపకరించే హార్మోన్ ట్రిఫ్టోఫాన్. ఇది మన ప్రపంచంలో సహజంగా దొరికే ఐదు ఆహార పదార్ధాల్లో పుష్కలంగా లభిస్తుందట. అవేమిటంటే 1. అరటి పండు 2. ఒక గ్లాసు పాలు 3. తేనె 4. బాదం 5. ఓట్స్‌. అయితే సుఖ నిద్రపోవాలంటే  ఇకపై  స్పైసీ పదార్థాలు, కాఫీ, టీ లాంటి డ్రింక్స్‌ అసలు తీసుకోకూడదని చెబుతున్నారు వీరు.
 
అరటిపండులో కార్భోహైడ్రెట్స్‌ శాతం ఎక్కువ. ఇవి మెదడులోని ట్రిప్టోఫాన్‌ హర్మోన్‌ ను ఉత్తేజపరుస్తాయి. అంతేగాకుండా తలత్రిప్పడాన్ని కూడ తగ్గిస్తాయి. ఇంకా అరటి పండులో పుష్కలముగా లభించే మెగ్నీషియం నరాలు, కండరాలకు విశ్రాంతి కలిగిస్తుంది. దీంతో సుఖంగా నిద్రపోవచ్చు.
 
ఇక నిద్రకు ఉపకరించేముందు గ్లాసు వేడి పాలు తాగాలని మన పెద్దలు చెప్పిన విషయమే. ఇక పాలల్లో ట్రిప్టోఫాన్‌ హర్మోన్‌ ఉత్తేజపరిచే గుణాలు ఎక్కువగా ఉన్నాయని సామ్మి పేర్కొన్నాడు. అంతేగాకుండా  మెదడుపై ఒత్తిడి పడకుండా చూస్తుందని, శరీరంలోని కాల్షియం కొరత లేకుండా చేస్తుందన్నారు.
 
 టేబుల్ స్పూన్ తేనేను నిద్రపోయే ముందు తీసుకుంటే హాయిగా నిద్రపోవచ్చు. తేనేలో కూడా ట్రిప్టోఫాన్‌ ప్రేరేపించే గుణాలు ఎక్కువగా ఉన్నాయి.
 
 రాత్రి వేళల్లో ఆకలిగా ఉంటే ఓట్స్‌ను ఆహార పదార్థాలను ఆహారంగా తీసుకుంటే సుఖంగా నిద్రపోవచ్చు. ఇక వేడి పాలల్లో ఓట్స్‌, తేనే, కలుపుకొని, అరటిపండుతో తీసుకుంటే ఉదయం లేచిన తర్వాత ఉల్లాసంగా ఉంటారు.
 
అన్నీ చూడండి

తాాజా వార్తలు

దోషి అని తేలితే ఉరి తీయండి.. సోనమ్ సోదరుడు

మహిళలు గౌరవంగా, ఆరోగ్యంగా జీవించాలనేది నా కోరిక : ఉపాస‌న కామినేని కొణిదెల

Sreeleela: శ్రీలీల కోసం మంత్రి శ్రీధర్ బాబును అగౌరవపరిచిన ఝాన్సీ.. ట్రోల్స్

Talli Ki Vandanam: పాఠశాలలకు వెళ్లే పిల్లల తల్లులకు శుభవార్త

TTD: తిరుమల గ్రీనింగ్ ప్రాజెక్టు.. 2025కల్లా పూర్తి.. రూ.4కోట్లతో ప్రణాళిక

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

Mega157 : మెగాస్టార్ చిరంజీవి, నయనతార చిత్రం షెడ్యూల్ ఈరోజు ముస్సోరీలో ప్రారంభం

సింగర్‌ మంగ్లీపై డ్రగ్స్ కేసు? త్రిపుర రిసార్ట్‌లో అర్థరాత్రి దాకా డీజే హోరు!

Rashmika : కుబేర నుంచి రష్మిక మందన్న థర్డ్ సింగల్ పీ పీ డుమ్ డుమ్ సాంగ్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments