Webdunia - Bharat's app for daily news and videos

Install App

భోజనం చేశాక ఇలా చేయొద్దు...

చాలా మంది భోజనం చేశాక టీలు సేవించడం, పండ్లు పుష్టిగా ఆరగించడం, స్నానం చేయడం వంటివి చేస్తుంటారు. నిజానికి భోజనం చేసిన తర్వాత ఓ గంట పాటు ఎలాంటి ఆహారం లేదా చిరు తిండ్లను తీసుకోరాదు. అలా చేయడం ఆరోగ్యానికి

Webdunia
సోమవారం, 20 ఆగస్టు 2018 (14:10 IST)
చాలా మంది భోజనం చేశాక టీలు సేవించడం, పండ్లు పుష్టిగా ఆరగించడం, స్నానం చేయడం వంటివి చేస్తుంటారు. నిజానికి భోజనం చేసిన తర్వాత ఓ గంట పాటు ఎలాంటి ఆహారం లేదా చిరు తిండ్లను తీసుకోరాదు. అలా చేయడం ఆరోగ్యానికి హానికరం అని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భోజనం తర్వాత ఏమేమి చేయకూడదో ఓ సారి తెలుసుకుందాం.
 
* చాలా మంది భోజనం చేసిన వెంటనే నిద్రపోయేందుకు పడకెక్కుతారు. నిజానికి తినగానే వెంటనే పక్కమీదకు చేరొద్దు. అలా నిద్రలోకి జారుకుంటే తిన్న ఆహారం జీర్ణమవ్వక ఇబ్బందులు తలెత్తుతాయి. 
 
* కొందరికి భోజనం చేయగానే స్నానం చేసే అలవాటు ఉంటుంది. ఇలా చేయడం వల్ల కాళ్లు, చేతుల్లోకి రక్త ప్రసరణ పెరుగుతుంది. దీనివల్ల పొట్ట చుట్టూ రక్తప్రసరణ తగ్గి జీర్ణవ్యవస్థ పనితీరు మందగించే ప్రమాదం ఉంది.
 
* భోజనం చేసేముందు కానీ, చేశాక కానీ వివిధ రకాల పండ్లు ఆరగించరాదు. ఇలా చేయడం వల్ల పొట్ట పెరుగుతుంది. రెండింటికీ మధ్య రెండు మూడు గంటల వ్యవధి ఉండాలి.
 
* అన్నం తిన్న తర్వాత టీ తాగితే భోజనం జీర్ణంకాదు. తేయాకులో ఉండే ఆమ్లాలు ఆహారంలో ఉండే మాంసకృత్తులను శరీరం వినియోగించుకోకుండా అడ్డుకుంటాయి. 

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments