Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధనియాల పొడిని గ్లాసుడు నీటిలో వేసుకుని పసుపు కలిపి తాగితే...

Webdunia
శుక్రవారం, 21 డిశెంబరు 2018 (10:01 IST)
ధనియాలు అంటే తెలియని వారుండరు. వీటిని అనేక రకములైన వంటలలో ఉపయోగిస్తుంటాము. ధనియాలు వంటలలోనే కాదండోయ్...... ఒక మంచి ఔషధంలా కూడా ఉపయోగపడతాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయి. ఎలాగో చూద్దాం. 
 
1. ధనియాలతో తయారుచేసే కషాయం వల్ల చాలా లాభాలున్నాయి. ధనియాలను  బాగా నీటిలో మరిగించి వడకట్టుకుని ఆ కషాయం తాగడం వల్ల వెంటనే జలుబు తగ్గిపోతుంది. అలాగే ధనియాలను రోజువారి తినే ఆహారంలో ఉండేటట్లు చూసుకోవడం వల్ల శరీరంలోని షుగర్ శాతం కూడా తగ్గుతుంది.
 
2. ధనియాల‌ను రోజూ తీసుకుంటే శరీరానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ అందుతాయి. దీంతో ఇమ్యూనిటీ పెరుగుతుంది. 
 
3. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు ధనియాల కషాయం తయారు చేసుకుని అందులో కాస్త పాలు, చక్కెర కలుపుకుని తాగడం వల్ల  మంచి నిద్రపడుతుంది. 
 
4. శరీరంలోని కొవ్వుని కరిగించడానికి కూడా ధనియాలు బాగా ఉపయోగపడతాయి. ధనియాలను మెత్తగా పొడిలాగా చేసుకుని అందులో కాస్త పసుపు కలుపుకుని దాన్ని నీటిలో కలుపుకుని తాగడం వల్ల శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది.
 
5. ధనియాలను తరచూ ఏదో ఒక రూపంలో ఆహారంలో చేర్చుకుంటే శృంగార శక్తి కూడా పెరుగుతుంది.
 
6. చర్మ సంరక్షణకు ధనియాలు బాగా ఉపయోగపతాయి. ధనియాలను మెత్తగా చూర్ణంలా చేసుకుని, ఆ మిశ్రమాన్ని ముఖంపై రాసుకోవడం వల్ల  ముఖంపై ఉండే మొటిమలు తగ్గుముఖం పడతాయి.
 
7. ధనియాలను ఏదో రకంగా రోజూ తీసుకుంటే షుగర్ వ్యాధిని అడ్డుకుంటుంది. అంతేకాకుండా టైఫాయిడ్‌ వచ్చినప్పుడు ధనియాలను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కేసీఆర్ చుట్టూత కొన్ని దెయ్యాలు ఉన్నాయ్ : ఎమ్మెల్సీ కవిత

Kavitha: తెలంగాణలో మరో షర్మిలగా మారనున్న కల్వకుంట్ల కవిత? (video)

43 సంవత్సరాల జైలు శిక్ష-104 ఏళ్ల వృద్ధుడు- చివరికి నిర్దోషిగా విడుదల.. ఎక్కడ?

Bus Driver: బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. సీటులోనే కుప్పకూలిపోయాడు.. కండెక్టర్ ఏం చేశాడు? (video)

Kishan Reddy: హైదరాబాద్ నగరానికి రెండు ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

RGV: సెన్సార్ బోర్డు కాలం చెల్లిపోయింది.. అసభ్యత వుండకూడదా? రామ్ గోపాల్ వర్మ

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

తర్వాతి కథనం
Show comments