Webdunia - Bharat's app for daily news and videos

Install App

జలుబు ఆస్తమాగా మారుతుందా? ఎలా?

చాలామంది జలుబుతో బాధపడుతున్నా ఆఫీసులకు వెళుతుంటారు. వీరివల్ల ఆఫీసులోని ఇతరులకు కూడా జలుబు సోకే ప్రమాదం ఉంది. పైగా, జలుబుకు సరైన చికిత్స చేయకుండా నిర్లక్ష్యం చేస్తే అది చివరకు ఆస్తమాగా మారే ప్రమాదముందన

Webdunia
శనివారం, 28 జులై 2018 (10:51 IST)
చాలామంది జలుబుతో బాధపడుతున్నా ఆఫీసులకు వెళుతుంటారు. వీరివల్ల ఆఫీసులోని ఇతరులకు కూడా జలుబు సోకే ప్రమాదం ఉంది. పైగా, జలుబుకు సరైన చికిత్స చేయకుండా నిర్లక్ష్యం చేస్తే అది చివరకు ఆస్తమాగా మారే ప్రమాదముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే సాధారణ జలుబు అయినప్పటికీ దానిపట్ల శ్రద్ధ వహించాల్సిందేనని వైద్యులు సలహా ఇస్తున్నారు.
 
* సీజనల్ జలుబులకు సరైన చికిత్స చేయకపోతే అవి క్రమంగా ఆస్తమాగా మారే అవకాశం ఉందని అలర్జీల వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
* జలుబు చేసి తుమ్మినప్పుడు వెలువడే సూక్ష్మజీవులు ఇతరులకు వ్యాపించి వారికి కూడా జలుబు సోకుతుంది. 
* జలుబు చేసినప్పుడు ఆఫీసుకు వెళ్లి ఇతరులకు దాన్ని వ్యాపింపచేయడం కంటే విశ్రాంతి తీసుకోవడం ఉత్తమమని నిపుణుల చెపుతారు. 
* సాధారణంగా జలుబు 7 నుంచి 12 రోజుల్లో తగ్గుతుంది. ఇలాంటి వైరల్ వ్యాధులకు యాంటీ బయోటిక్స్ వాడటం కంటే హాయిగా విశ్రాంతి తీసుకోవడమే ఉత్తమం. 
* వేడి నీటిలో పసుపు లేదా ఏదైనా బామ్ వేసి ఆవిరి పట్టడం లేదా మరిగిన నీటి ఆవిరిని పట్టి, విశ్రాంతి తీసుకోవడం వల్ల ఎక్కువ ఉపశమనం కలుగుతుంది. 
* చీదినప్పుడు, దగ్గినప్పుడు రక్తం పడుతుందా...? అని గమనించాలి. అలా రక్తం పడితే అది తీవ్రమైన రుగ్మతగా గమనించాలి. 
* స్వల్పంగా తలనొప్పి, జలుబు ఉన్నపుడు తగినంత విశ్రాంతి తీసుకోవడం అన్నిటికంటే మించిన మార్గం లేదు. 
* తుమ్ములు, జలుబుతో బాధపడుతూ ఉద్యోగానికి వెళ్లడం సరైంది కాదు. 
* తల, శరీరం నొప్పులు, జ్వరం వంటివి ఉన్నప్పుడు, తుమ్ములతో జలుబు మొదలైనప్పుడు పారాసిటమాల్ బిళ్లలు, వేపొరబ్స్ లాంటివి వాడినా అవి శాశ్వత పరిష్కారం కాదని వైద్యులు సలహా ఇస్తున్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments