జలుబు ఆస్తమాగా మారుతుందా? ఎలా?

చాలామంది జలుబుతో బాధపడుతున్నా ఆఫీసులకు వెళుతుంటారు. వీరివల్ల ఆఫీసులోని ఇతరులకు కూడా జలుబు సోకే ప్రమాదం ఉంది. పైగా, జలుబుకు సరైన చికిత్స చేయకుండా నిర్లక్ష్యం చేస్తే అది చివరకు ఆస్తమాగా మారే ప్రమాదముందన

Webdunia
శనివారం, 28 జులై 2018 (10:51 IST)
చాలామంది జలుబుతో బాధపడుతున్నా ఆఫీసులకు వెళుతుంటారు. వీరివల్ల ఆఫీసులోని ఇతరులకు కూడా జలుబు సోకే ప్రమాదం ఉంది. పైగా, జలుబుకు సరైన చికిత్స చేయకుండా నిర్లక్ష్యం చేస్తే అది చివరకు ఆస్తమాగా మారే ప్రమాదముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే సాధారణ జలుబు అయినప్పటికీ దానిపట్ల శ్రద్ధ వహించాల్సిందేనని వైద్యులు సలహా ఇస్తున్నారు.
 
* సీజనల్ జలుబులకు సరైన చికిత్స చేయకపోతే అవి క్రమంగా ఆస్తమాగా మారే అవకాశం ఉందని అలర్జీల వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
* జలుబు చేసి తుమ్మినప్పుడు వెలువడే సూక్ష్మజీవులు ఇతరులకు వ్యాపించి వారికి కూడా జలుబు సోకుతుంది. 
* జలుబు చేసినప్పుడు ఆఫీసుకు వెళ్లి ఇతరులకు దాన్ని వ్యాపింపచేయడం కంటే విశ్రాంతి తీసుకోవడం ఉత్తమమని నిపుణుల చెపుతారు. 
* సాధారణంగా జలుబు 7 నుంచి 12 రోజుల్లో తగ్గుతుంది. ఇలాంటి వైరల్ వ్యాధులకు యాంటీ బయోటిక్స్ వాడటం కంటే హాయిగా విశ్రాంతి తీసుకోవడమే ఉత్తమం. 
* వేడి నీటిలో పసుపు లేదా ఏదైనా బామ్ వేసి ఆవిరి పట్టడం లేదా మరిగిన నీటి ఆవిరిని పట్టి, విశ్రాంతి తీసుకోవడం వల్ల ఎక్కువ ఉపశమనం కలుగుతుంది. 
* చీదినప్పుడు, దగ్గినప్పుడు రక్తం పడుతుందా...? అని గమనించాలి. అలా రక్తం పడితే అది తీవ్రమైన రుగ్మతగా గమనించాలి. 
* స్వల్పంగా తలనొప్పి, జలుబు ఉన్నపుడు తగినంత విశ్రాంతి తీసుకోవడం అన్నిటికంటే మించిన మార్గం లేదు. 
* తుమ్ములు, జలుబుతో బాధపడుతూ ఉద్యోగానికి వెళ్లడం సరైంది కాదు. 
* తల, శరీరం నొప్పులు, జ్వరం వంటివి ఉన్నప్పుడు, తుమ్ములతో జలుబు మొదలైనప్పుడు పారాసిటమాల్ బిళ్లలు, వేపొరబ్స్ లాంటివి వాడినా అవి శాశ్వత పరిష్కారం కాదని వైద్యులు సలహా ఇస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బంగారు గొలుసు కోసం వృద్ధురాలిని హత్య- ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దంపతుల దారుణం

జనవరి 29 నుండి ఫిబ్రవరి 1 వరకు అరకు చలి ఉత్సవం.. సీఎం చేతుల మీదుగా ప్రారంభం

అప్పు తీర్చమన్నందుకు వృద్ధుడిని సజీవ దహనం చేశారు.. ఎక్కడ?

అక్రమ మైనింగ్‌ను బాట వేస్తోన్న ఉచిత ఇసుక విధానం.. పచ్చి మోసం.. గోవర్ధన్ రెడ్డి

రైల్వేకోడూరు ఎమ్మెల్యే వల్ల 5 సార్లు ప్రెగ్నెంట్, అబార్షన్ అయ్యింది: మహిళ ఆరోపణ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నా.. కానీ కొన్నాళ్ళకే అసలు విషయం తెలిసింది.. : తమన్నా

15 రోజుల్లో ₹358 కోట్లకు పైగా వసూలు చేసిన మన శంకరవరప్రసాద్ గారు

ఆ బాలీవుడ్ హీరోయిన్ నా లక్కీ ఛార్మ్ : కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ

బరాబర్ ప్రేమిస్తా లో మళ్లీ మళ్లీ సాంగ్ బాగుంది : జయంత్ సి పరాన్జి

న్యాయం చేసేలా ప్రయత్నిస్తా : రఘు కుంచె - దేవగుడి అలరిస్తుంది : బెల్లం రామకృష్ణ రెడ్డి

తర్వాతి కథనం
Show comments