Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎండిన ద్రాక్షల్ని నేతిలో వేయించి తింటే?

ద్రాక్షలు ఎండినా మేలే.. పచ్చిగా వున్నా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ద్రాక్షల్లో పలురకాలున్నాయి. ద్రాక్షపండ్లను అలాగే తిన్నా.. లేకుంటే జ్యూస్ తాగినా గుండెకు మేలు చేసినవారమవుతాం. ద్రాక్ష పండ్లను పన్నీరులో

Webdunia
శనివారం, 29 జులై 2017 (14:44 IST)
ద్రాక్షలు ఎండినా మేలే.. పచ్చిగా వున్నా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ద్రాక్షల్లో పలురకాలున్నాయి. ద్రాక్షపండ్లను అలాగే తిన్నా.. లేకుంటే జ్యూస్ తాగినా గుండెకు మేలు చేసినవారమవుతాం. ద్రాక్ష పండ్లను పన్నీరులో నాననబెట్టి రసం పిండుకుని తాగడం చేస్తే గుండెపోటు దూరమవుతుంది. ఉదర సంబంధిత వ్యాధులు నయం కావాలంటే.. ద్రాక్ష రసాన్ని మూడు పూటలా అర గ్లాసు మేర తీసుకోవాలి. 
 
20 గ్రాముల ఎండిన ద్రాక్షల్ని నేతిలో వేయించి తింటే జలుబు, దగ్గు దూరమవుతుంది. మాంసాహారం తీసుకోని వారు... రోజూ ద్రాక్ష పండ్లను తీసుకోవడం ద్వారా మాంసాహారానికి ధీటుగా ప్రోటీన్లను పొందవచ్చు. రోజూ ద్రాక్ష పండ్లను తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఉదయం పూట పరగడుపున ఒక గ్లాసుడు ద్రాక్ష రసం తీసుకుంటే తలనొప్పికి చెక్ పెట్టవచ్చు. 
 
నెలసరి నొప్పులు, సమస్యలను ఎదుర్కొనే మహిళలు, ఇక గర్భిణీ మహిళలు ప్రతిరోజూ ఉదయం పరగడుపున ద్రాక్ష రసం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. పిల్లల ఆరోగ్యానికి కూడా ద్రాక్ష రసం మేలు చేస్తుంది. దంతాలు, మెదడును ద్రాక్ష పండ్లు చురుగ్గా వుంచుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం ... పిడుగుపాటుకు ఇద్దరు మృతి (Video)

వివేకా కుమార్తె సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉంది : వైఎస్ షర్మిల

బోయ్ ఫ్రెండ్ కౌగిలించుకోలేదని 14 అంతస్తుల కాలేజీ భవనం పైనుంచి దూకేసిన యువతి

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

తర్వాతి కథనం
Show comments