Webdunia - Bharat's app for daily news and videos

Install App

అన్నంపై ఉండే అపోహలు...

దేశంలో 70 నుంచి 80 శాతం మంది ప్రజలు వరి బియ్యంతో తయారు చేసే అన్నమే ఆరగిస్తుంటారు. ఈ అన్నంలోకి తమకు ఇష్టమైన రుచికరమైన కూరలను తయారు చేసుకుని అందులో కలుపుకుని ఆరగిస్తుంటారు. అయితే అన్నం తినడంపై చాలా మంది

Webdunia
గురువారం, 5 జులై 2018 (09:41 IST)
దేశంలో 70 నుంచి 80 శాతం మంది ప్రజలు వరి బియ్యంతో తయారు చేసే అన్నమే ఆరగిస్తుంటారు. ఈ అన్నంలోకి తమకు ఇష్టమైన రుచికరమైన కూరలను తయారు చేసుకుని అందులో కలుపుకుని ఆరగిస్తుంటారు. అయితే అన్నం తినడంపై చాలా మందికి పలు అపోహలు ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
 
* సాధారణంగా రాత్రిపూట చాలా మంది అన్నంకు బదులు చపాతీ, టిఫన్ వంటివి తీసుకుంటుంటారు. వీటికంటే అన్నం ఆరగించడమే ఉత్తమమని వైద్యులు చెపుతున్నారు. ఎందుకంటే.. అన్నం తినడం వల్ల చక్కగా నిద్ర పడుతుంది. దీంతో లెప్టిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. 
 
* మన శరీరంలో శక్తిని బాగా ఖర్చు చేస్తుంది. కొవ్వు పేరుకుపోకుండా చూస్తుంది. దీంతోపాటు ఆకలి వేయకుండా ఉంచుతుంది. కనుక రాత్రి పూట నిర్భయంగా అన్నం తినవచ్చు.  
 
* ముఖ్యంగా దేశంలో చక్కెర వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్నారు. వీరంతా రాత్రిళ్లు అన్నం మానేసి చపాతీలు, వివిధ రకాల రొట్టెలు ఆరగిస్తుంటారు. నిజానికి మధుమేహం ఉన్న వారు నిర్భయంగా అన్నం తినవచ్చు. 
 
* తక్కువ మోతాదులో అన్నం తినడంతోపాటు దాంట్లో పప్పులు, కూరగాయలు, నెయ్యి వంటి ఆహారాలను చేర్చుకుంటే భోజనం చేసిన వెంటనే షుగర్ స్థాయిలు పెరగకుండా ఉంటాయి. ఇలా డయాబెటిస్ ఉన్నవారు కూడా అన్నంతిన్నట్టయితే చక్కెర నిల్వల స్థాయిని నియంత్రణలో ఉంచుతాయని చెపుతున్నారు. 
 
* అన్నం తినడం వల్ల శరీరంలో కొవ్వు చేరదు. నిత్యం మనం తినే జంక్‌ఫుడ్, నూనె పదార్థాలు, వ్యాయామం చేయకపోవడం వంటి కారణాల వల్లే శరీరంలో కొవ్వు పెరుగుతుంది. దీన్ని నివారించాలంటే అన్నం ఆరగించడమే ఉత్తమం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఎయిర్ ఇండియా విమానంలో తోటి ప్రయాణీకుడిపై మూత్ర విసర్జన

పూణేలో భూటాన్ మహిళపై సామూహిక అత్యాచారం.. పార్టీల కంటూ తీసుకెళ్లి?

వ్యభిచార గుట్టు రట్టు.. ఇద్దరు మహిళలను కాపాడిన హైదరాబాద్ పోలీసులు

హైదరాబాద్ - అమరావతి మధ్య గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే- కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

సింగపూరులో కుమారుడిని సందర్శించిన పవన్.. నార్మల్ వార్డుకు షిఫ్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

తర్వాతి కథనం
Show comments