కారణం లేకుండా నిద్రపట్టకపోవడం లేదా నిద్ర పట్టిన తర్వాత గాఢనిద్రలోకి చేరుకోలేకపోవడం కొంతమందికి తొందరగానే నిద్రపడుతుంది. కాని అర్థరాత్రి మెలకువ వస్తుంది. చాలా మంది నిద్రపోయిన తర్వాత నిద్రలేచే సమయానికంటే చాలా ముందరే మెలుకుంటారు.
ఆ తర్వాత తిరిగి ఎంత ప్రయత్నించినా వీరికి నిద్రరాదు. మగవారిలో కన్నా ఆడవారిలో నిద్రలేమి ఎక్కువుగా ఉంటుంది. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఈ వ్యాధి వాత, పిత్త, కఫ దోషాల ప్రభావం వలన నిద్రలేమి వ్యాధి వస్తుంది.
వాత, కఫ, పిత్త వ్యాధుల వలన వచ్చే నిద్రలేమికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు...
* రాత్రి పదిగంటలకు నిద్రపోవాలి. * పడుకునే ముందు పాలు త్రాగాలి. * వేడి ఆహారం తినటం మంచిది. * ఒత్తిడితో కూడిన పని చేయరాదు. * మసాలా పదార్థాలు తీసుకోకపోవడం మంచిది. * ఉపవాసం చేయరాదు. * వ్యాయామం చేయటం మంచిది * గోరు వెచ్చని నీరు త్రాగాలి. * తీపి, పులుపు, లవణ పదార్థాలు తినటం తగ్గించాలి.