ఎసిడిటీ(కడుపులో మంట) వల్ల జీర్ణాశయంలో ఒకలాంటి మంట ఏర్పడుతుంది. దీంతో తిన్న ఆహారం సరిగా జీర్ణం కాదు.
అసలు అసిడిటీకి కారణాలు ఏంటి? * సరిగా నిద్ర లేకపోవడం * ఆహారాన్ని త్వరగా భుజించడం. సరిగా నమిలి తినకపోవడం. * తీసుకునే ఆహారంలో మసాలా దినుసులతో కూడుకున్న ఆహారం ఉండటం * ధూమపానం, మద్యపానం సేవిస్తుండటం... * శరీరానికి తగిన బరువుకన్నా ఎక్కువ బరువు ఉండటం. లేదా తీసుకునే ఆహారం ఎక్కువగా తీసుకోవటం మూలాన జీర్ణక్రియ సరిగా ఉండదు. దీంతో ఉదరం, గుండెల్లో మంట ప్రారంభమౌతుంది. * సమయానికి భోజనం చేయకపోవడం
ఎసిడిటీని అదుపు చేసేందుకు చిట్కాలు : ఎసిడిటీతో బాధపడే వారికి అరటిపండు అత్యుత్తమమైన ఔషధం. ప్రతి రోజు అరటిపండును ఆహారంగా తీసుకుంటుంటే అసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుంది. యాపిల్ పండుతో తయారు చేసిన రసం, వెనిగర్, తేనెను తగినంత నీటిలో కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని భోజనానికి ముందు సేవించి భోజనం తీసుకుంటే అసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుందంటున్నారు వైద్యులు.
* మీరు తీసుకునే ఆహారంలో వీలైనంత మేరకు వేపుడు పదార్థాలను తగ్గించండి. దీంతోపాటు ఊరగాయ, మసాలా దినుసులతో కూడుకున్న ఆహారం, చాక్లెట్లను తీసుకోకుండా ఉండేందుకు ప్రయత్నించండి.
* తీసుకునే ఆహారంలో భోజనానికి భోజనానికి మధ్య ఎక్కువ సమయం ఖాళీ కడుపుతో ఉండకండి. దీంతో ఉదరంలో గ్యాస్ పేరుకుపోయే ప్రమాదం ఉంది. * ప్రతి రోజు ఎనిమిది గ్లాసుల నీటిని సేవిచేందుకు ప్రయత్నించండి. * భోజనం తీసుకున్న వెంటనే నిద్రకుపక్రమించకండి. * మద్యపానం, ధూమపానం అలవాటుంటే వాటిని మానేసేందుకు ప్రయత్నించండి.
అసిడిటీని నిరోధించేందుకు చిట్కాలు : * అసిడిటీతో బాధపడే వారికి తులసి దివ్యమైన ఔషధం. తులసి ఆకులను ఉదయం రెండు ఆకులను నమిలి తింటే అసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుంది. * బెల్లం చప్పరిస్తుంటే అసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుంది. దీనిని ప్రతి రోజు నాలుగు నుంచి ఐదు సార్లు తీసుకుంటుండాలి. * పుచ్చకాయ, కీరకాయ, అరటిపండును తీసుకుంటే సమస్య తగ్గుతుంది.