Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

ఠాగూర్
బుధవారం, 1 జనవరి 2025 (16:59 IST)
చాలామంది ఐటీ ఉద్యోగులు గంటల కొద్దీ కుర్చీలకు అతుక్కునిపోయి పని చేస్తుంటారు. ఇలాంటి వారికి ప్రాణముప్పు పొంచివుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిశ్చలమైన లైఫ్ స్టైల్ ఆరోగ్యానికి ఏమాత్రం మంచిదికాదంటున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వ్యాయామం చేయాలని సలహా ఇస్తున్నారు. అయితే, రోజుకు పదిన్నర గంటలకు పైగా కూర్చునే వారిని వ్యాయామం కూడా కాపాడలేదని తాజా అధ్యయనం తేల్చి చెప్పింది.
 
రోజులో దాదాపు సగం గంటలు కూర్చుంటే వ్యాయామం చేసినా ఎందుకూ కొరగాకుండా పోతుందని ఎంఐటీ, హార్వర్డ్ యూనివర్సిటీ తాజా అధ్యయనం పేర్కొంది. మిగతా వారితో పోలిస్తే రోజులో 10.6 గంటల కంటే ఎక్కువ సేపు కూర్చునే వారిలో గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువని తేలింది. వారానికి సిఫార్సు చేసిన 150 నిమిషాల వ్యాయామం చేసినప్పటికీ ఇటువంటి వారిలో ఎలాంటి ప్రభావం ఉండదని తేల్చి చెప్పింది.
 
రోజులో పదిన్నర గంటలకుపైగా కూర్చునే వారిలో గుండె వైఫల్యం కారణంగా 15 శాతం, హృద్రోగాలతో మరణించే అవకాశం 33 శాతం ఎక్కువని పేర్కొంది. వ్యాయామం అలవాటు లేని వారిలో ఈ ముప్పు మరింత ఎక్కువని అధ్యయనం తెలిపింది. అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీకి చెందిన ఫ్లాగ్లిప్ జర్నల్ జేఏసీసీలో ఈ అధ్యయనం ప్రచురితమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వరంగల్ యువత రోడ్ల ప్రవర్తన మార్చడంలో ముందడుగు

Sanam Shetty: పారిశుద్ధ్య కార్మికులతో సనమ్ శెట్టి నిరసన.. చిన్మయి, విజయ్‌కి తర్వాత? (Video)

Praja Rajyam: ప్రజా రాజ్యం, జనసేన పార్టీలను తొలగించిన ఈసీ.. నిజమేనా?

హైటెక్ భారతంలో అంబులెన్స్‌కు కరువాయె ... భార్య మృతదేహాన్ని బైకుకు కట్టి...

డిమాండ్ల పరిష్కారం కోసం షూటింగ్ బంద్ సబబు కాదు : మంత్రి కోమటిరెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

నా కోసం ప్రభుత్వ వాహనం పంపలేదు... దానికి నాకూ ఎలాంటి సంబంధం లేదు : నిధి అగర్వాల్

ప్రభుత్వ వాహనంలో నిధి అగర్వాల్.. క్లారిటీ ఇచ్చిన హరిహర వీరమల్లు హీరోయిన్

Madhu Shalini : మధు శాలిని ప్రెజెంట్స్ కన్యా కుమారి రిలీజ్ కు సిద్ధం

తర్వాతి కథనం
Show comments