రోజుకు 10 గంటల పాటు కుర్చీలోనే కూర్చొంటున్నారా... అయితే, డేంజరే!!

ఠాగూర్
బుధవారం, 1 జనవరి 2025 (16:59 IST)
చాలామంది ఐటీ ఉద్యోగులు గంటల కొద్దీ కుర్చీలకు అతుక్కునిపోయి పని చేస్తుంటారు. ఇలాంటి వారికి ప్రాణముప్పు పొంచివుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిశ్చలమైన లైఫ్ స్టైల్ ఆరోగ్యానికి ఏమాత్రం మంచిదికాదంటున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వ్యాయామం చేయాలని సలహా ఇస్తున్నారు. అయితే, రోజుకు పదిన్నర గంటలకు పైగా కూర్చునే వారిని వ్యాయామం కూడా కాపాడలేదని తాజా అధ్యయనం తేల్చి చెప్పింది.
 
రోజులో దాదాపు సగం గంటలు కూర్చుంటే వ్యాయామం చేసినా ఎందుకూ కొరగాకుండా పోతుందని ఎంఐటీ, హార్వర్డ్ యూనివర్సిటీ తాజా అధ్యయనం పేర్కొంది. మిగతా వారితో పోలిస్తే రోజులో 10.6 గంటల కంటే ఎక్కువ సేపు కూర్చునే వారిలో గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువని తేలింది. వారానికి సిఫార్సు చేసిన 150 నిమిషాల వ్యాయామం చేసినప్పటికీ ఇటువంటి వారిలో ఎలాంటి ప్రభావం ఉండదని తేల్చి చెప్పింది.
 
రోజులో పదిన్నర గంటలకుపైగా కూర్చునే వారిలో గుండె వైఫల్యం కారణంగా 15 శాతం, హృద్రోగాలతో మరణించే అవకాశం 33 శాతం ఎక్కువని పేర్కొంది. వ్యాయామం అలవాటు లేని వారిలో ఈ ముప్పు మరింత ఎక్కువని అధ్యయనం తెలిపింది. అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీకి చెందిన ఫ్లాగ్లిప్ జర్నల్ జేఏసీసీలో ఈ అధ్యయనం ప్రచురితమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Jagan mohan Reddy: ఈ నెల 20న నాంపల్లి సీబీఐ కోర్టుకు జగన్మోహన్ రెడ్డి

పాకిస్థాన్ ప్రభుత్వమే భారత్‌పై ఉగ్రదాడులు చేయిస్తోంది : ఖైబర్‌పుంఖ్వా సీఎం సొహైల్

మారేడుపల్లి అడవుల్లో మళ్లీ మోగిన తుపాకుల మోత... మావో కార్యదర్శి దేవ్‌జీ హతం

సిడ్నీలో రోడ్డు ప్రమాదం.. రోడ్డు దాటిన 8నెలల గర్భవతి.. భారతీయ మహిళ మృతి

శబరిమలలో భారీ రద్దీ.. స్పృహ కోల్పోయి మృతి చెందిన మహిళా భక్తురాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మిడి రవిని ఎన్‌కౌంటర్ చేయాలి : నిర్మాత సి.కళ్యాణ్

నా సినిమాలు రీచ్ కాలేదు, త్వరలో డైరెక్షన్ చేస్తా : రాజ్ తరుణ్

ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కిల్లర్ సర్ ప్రైజ్ చేస్తుంది - డైరెక్టర్ పూర్వజ్

Rajamouli Contravarcy: హనుమంతుడిపై వ్యాఖ్యలకు, వారణాసి టైటిల్ పైన రాజమౌళికు చుక్కెదురు

సంతాన ప్రాప్తిరస్తు రెస్పాన్స్ తో హ్యాపీగా ఉన్నాం - మధుర శ్రీధర్ రెడ్డి

తర్వాతి కథనం
Show comments