Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇకపై ఏసీల్లో 24 లేదా 26 డిగ్రీల టెంపరేచర్ మాత్రమే...

దేశంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. దీంతో డిమాండ్ కూడా నానాటికీ పెరిగిపోతోంది. ఈ పరిస్థితుల్లో విద్యుత్‌ను ఆదా చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇకపై ఏసీలో కేవలం 24 లేదా 25 డిగ్రీల

Webdunia
ఆదివారం, 24 జూన్ 2018 (11:39 IST)
దేశంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. దీంతో డిమాండ్ కూడా నానాటికీ పెరిగిపోతోంది. ఈ పరిస్థితుల్లో విద్యుత్‌ను ఆదా చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇకపై ఏసీలో కేవలం 24 లేదా 25 డిగ్రీల టెంపరేచర్‌ మాత్రమే ఉండేలా చర్యలు తీసుకోనుంది.
 
ఇలా చేయడం వల్ల విద్యుత్ బిల్లులపై భారం తగ్గడంతో పాటు వినియోగదారుల ఆరోగ్యం బాగుంటుందని ప్రజల్లో అవగాహన పెంచాలని కేంద్రం నిర్ణయించింది. ఇదేసమయంలో అన్ని వాణిజ్య, ప్రభుత్వ రంగ సంస్థలూ తమ కార్యాలయాల్లో 24 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండేలా ఏసీలను మార్చుకోవాలని విద్యుత్ శాఖ నోటీసులను పంపింది. 
 
ముఖ్యంగా, ప్రజల్లో ఆరు నెలల పాటు అవగాహన కల్పించనుంది. ఆ తర్వాత ప్రజల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్‌ను గమనించి, 24 డిగ్రీల డిఫాల్ట్ సెట్టింగ్‌ను తప్పనిసరి చేయాలని భావిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ఈ విషయమై ఏసీ తయారీదారుల కంపెనీలతో చర్చించామని అధికారులు తెలిపారు. 
 
సాధారణంగా మానవ శరీరం 35 నుంచి 37 డిగ్రీల సెల్సీయస్‌లో ఉంటుంది కాబట్టి 24 డిగ్రీల చల్లదనం హాయిగా ఉంటుందని తెలిపిన విద్యుత్ మంత్రి ఆర్కే.సింగ్ చెపుతున్నారు. కానీ, చాలా హోటళ్లు, రెస్టారెంట్లు, వాణిజ్య భవనాల్లో 18 నుంచి 21 డిగ్రీల టెంపరేచర్‌ను కొనసాగిస్తున్నారని అన్నారు. దీనివల్ల విద్యుత్ వినియోగం పెరగడంతో పాటు.. విద్యుత్ బిల్లుల భారం పెరుగుతుందని చెపుతున్నారు.

అంతేకాకుండా, వినియోగదారుల ఆరోగ్యం కూడా బాగుటుందనీ, ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా ఉత్పన్నం కావని చెబుతున్నారు. 24  లేదా 26 డిగ్రీల టెంపరేచర్‌ను పెట్టుకోవడం వల్ల అనారోగ్యంతో బాధపడేవారు కూడా ఏసీ గదుల్లో హాయిగా నిద్రపోవచ్చని చెపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

కాఫీ బాగోలేదన్నందుకు హత్య చేసారా? కొత్తజంట హనీమూన్ మిస్సింగ్ మిస్టరీ

రౌడీ షీటర్లను పరామర్శించేందుకు వెళ్లిన జగన్... ప్రజా సంఘాల నిరసన

కెనరా బ్యాంకులో దొంగలుపడ్డారు... 59 కేజీల బంగారం మాయం

Kukatpally: కూకట్‌పల్లిలో రూ.2కోట్ల డ్రగ్స్‌తో ముఠా అరెస్ట్

ఆగివున్న ట్యాంకర్‌ను ఢీకొన్న కారు : ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Anushka: ఘాటి కోసం మూటాముల్లి తో కాలువ దాటుతున్న అనుష్క శెట్టి హైలైట్

తర్వాతి కథనం
Show comments