Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనాకు కషాయం తయారు చేసిన చెన్నై 'సిద్ధ' వైద్యులు

Webdunia
శనివారం, 20 జూన్ 2020 (07:46 IST)
ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్‌కు ఇప్పటివరకు ఏ ఒక్క దేశం కూడా మందును కనిపెట్టలేదు. కరోనాకు విరుగుడు వ్యాక్సిన్‌పై ప్రపంచ దేశాలన్నీ పరిశోధనలు చేస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఈ పరిశోధనల్లో నిమగ్నమైవుంది. అయితే, చెన్నై సిద్ధ వైద్యులు మాత్రం ఓ కషాయాన్ని తయారు చేశారు. ఇది కరోనా వైరస్ బారినపడిన రోగులకు ఇవ్వగా, వారంతా కోలుకున్నట్టు పేర్కొన్నారు. ఈ కషాయం పేరు కఫసుర. ఈ మూలికా ఔషధాన్ని చెన్నై, తాంబరంలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సిద్ధ వైద్యులు తయారు చేశారు. 
 
ఈ కఫసురా కషాయం తయారీ కోసం 'సిద్ధ' అసిస్టెంట్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ వి. విక్రమ్‌ కుమార్‌ నేతృత్వంలో గత డిసెంబరులోనే పరిశోధనలు ప్రారంభించారు. ఆ తర్వాత ఈ కషాయాన్ని కరోనా రోగులకు చెందిన రెండు బృందాలకు ఏప్రిల్‌ 1 నుంచి ఐదు రోజుల పాటు ఈ ఔషధం అందించారు. ఏప్రిల్‌ 6న వారికి పరీక్షలు చేయగా నెగెటివ్‌ వచ్చింది. 
 
అలాగే, ఏప్రిల్‌ 20న జరిపిన పరీక్షల్లోనూ నెగెటివ్‌ వచ్చింది. ఇక మే, జూన్‌లలోనూ ఎస్‌ఆర్‌ఎం ఆస్పత్రిలోని కరోనా బాధితులపై ప్రయోగాత్మకంగా పరీక్షించారు. ఇక్కడ కూడా కరోనా పాజిటివ్‌ వచ్చిన వారికి ఐదు రోజుల్లోనే నెగెటివ్ వచ్చింది. అయితే, దీనిపై సిద్ధ వైద్యులు ధీమాగా ఉన్నప్పటికీ.. కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి మరికొంత పరిశోధన తర్వాత అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments