Webdunia - Bharat's app for daily news and videos

Install App

జామ కాయలు తింటే నిఫా వైరస్ సోకుతుందా? పరీక్షల్లో నిర్ధారణ!

Webdunia
బుధవారం, 17 జులై 2019 (13:35 IST)
జామకాయ.. దీన్ని పేదోడి యాపిల్‌గా అభివర్ణిస్తారు. అలాంటి జామకాయ ఆరగించిన ఓ విద్యార్థికి నిఫా వైరస్ సోకింది. నిజానికి వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు సోకడం సహజం. అదేసమయంలో వివిధ రకాల వైరస్‌లు కూడా విజృంభిస్తుంటాయి.

తాజాగా కేరళ రాష్ట్రంలో నిఫా వైరస్ ప్రతాపం చూపుతోంది. ఇప్పటికే ఈ వ్యాధినపడినవారు పలువురు ఉన్నారు. వీరంతా ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. తాజాగా 23 యేళ్ళ విద్యార్థికి కూడా ఈ వైరస్ సోకింది. అతనికి జరిపిన వైద్య పరీక్షలో ఈ విషయం నిరూపితమైంది కూడా. 
 
దీంతో ఈ యేడాది కేరళ రాష్ట్రంలో నమోదైన తొలి నిఫా కేసుగా గుర్తించారు. అయితే, ఈ విద్యార్థికి నిఫా వైరస్ సోకిందన్న అంశంపై వైద్యులు వివిధ రకాల వైద్య పరీక్షలు చేశారు. ఇందుకోసం ఆరుగురు వైద్యుల బృందాన్ని కేరళ ప్రభుత్వం నియమించింది. ఈ బృందం జరిపిన పరిశోధన, వైద్య పరీక్షల్లో ఓ ఆసక్తికర అంశం వెలుగు చూసింది. 
 
ఈ వైరస్ సోకిన విద్యార్థి రెండు వారాల క్రితం బాగా మగ్గి, కుళ్లిపోయిన జామకాయలు ఆరగించినట్టు తేలింది. ఈ కాయలను ఆరగించడం వల్లే ఈ సమస్య వచ్చినట్టు తేలింది. నిజానికి జామకాయలు తింటే నిఫా వైరస్ సోకదనీ కానీ, అతని ఆరగించిన కుళ్ళిపోయిన జామకాయను గబ్బిలం కొరికివుండొచ్చని అందుకే అతనికి నిఫా వైరస్ సోకివుంటుందని వైద్యులు నిర్ధారించారు. దీంతో ఆ విద్యార్థి రక్తం శాంపిల్స్ తీసుకుని వైద్య పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు పంపించారు. 
 
ఇదిలావుంటే, నిఫా వైరస్ లక్షణాలతో బాధపడుతూ ఇటీవల కలామర్సరీ వైద్య కాలేజీలో ఆస్పత్రిలో చేరిన ఐదుగురు విద్యార్థులు ఆరోగ్యంగా కోలుకున్న తర్వాత వారంతా డిశ్చార్జ్ అయ్యారు. వీరి పరిస్థితి నిలకడగానే వుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

వరంగల్ యువత రోడ్ల ప్రవర్తన మార్చడంలో ముందడుగు

Sanam Shetty: పారిశుద్ధ్య కార్మికులతో సనమ్ శెట్టి నిరసన.. చిన్మయి, విజయ్‌కి తర్వాత? (Video)

Praja Rajyam: ప్రజా రాజ్యం, జనసేన పార్టీలను తొలగించిన ఈసీ.. నిజమేనా?

హైటెక్ భారతంలో అంబులెన్స్‌కు కరువాయె ... భార్య మృతదేహాన్ని బైకుకు కట్టి...

డిమాండ్ల పరిష్కారం కోసం షూటింగ్ బంద్ సబబు కాదు : మంత్రి కోమటిరెడ్డి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

నా కోసం ప్రభుత్వ వాహనం పంపలేదు... దానికి నాకూ ఎలాంటి సంబంధం లేదు : నిధి అగర్వాల్

ప్రభుత్వ వాహనంలో నిధి అగర్వాల్.. క్లారిటీ ఇచ్చిన హరిహర వీరమల్లు హీరోయిన్

Madhu Shalini : మధు శాలిని ప్రెజెంట్స్ కన్యా కుమారి రిలీజ్ కు సిద్ధం

తర్వాతి కథనం
Show comments