Webdunia - Bharat's app for daily news and videos

Install App

18 నుంచి 24 ఏళ్ళ లోపే పిల్ల‌ల్ని క‌నాల‌ట‌... లేదంటే...?

నాక‌పుడే పెళ్ళొద్దు... ఇంకా చ‌దువుకోవాలి... చాలా ప్లానింగ్ ఉంది... బాగా సంపాదించాక అప్పుడే పెళ్ళి అంటుంటారు కుర్ర‌కారు. లైఫ్ అంతా ప్లానింగ్ చేసుకుంటున్నాం అంటూ చెపుతుంటారు. నేటి యువ‌తీయువ‌కులు పెళ్ళి, సంతానం కంటే త‌మ కెరీర్‌ను తీర్చిదిద్దుకునే విష‌యా

Webdunia
శనివారం, 28 మే 2016 (15:56 IST)
నాక‌పుడే పెళ్ళొద్దు... ఇంకా చ‌దువుకోవాలి... చాలా ప్లానింగ్ ఉంది... బాగా సంపాదించాక అప్పుడే పెళ్ళి అంటుంటారు కుర్ర‌కారు. లైఫ్ అంతా ప్లానింగ్ చేసుకుంటున్నాం అంటూ చెపుతుంటారు. నేటి యువ‌తీయువ‌కులు పెళ్ళి, సంతానం కంటే త‌మ కెరీర్‌ను తీర్చిదిద్దుకునే విష‌యానికే అత్మంత ప్రాధాన్యం ఇస్తున్నారు. పెళ్ళి, పిల్ల‌లు కంటే ముందు ఆర్థికంగా సెటిల్ కావాల‌ని... ఆ త‌ర్వాతే అన్నీ అని భావిస్తున్నారు. ఈ ఆలోచ‌న మంచిదే కానీ, ఇదే లైఫ్ ప్లానింగ్ కాదంటున్నారు వైద్య నిపుణులు. పెళ్ళి, పిల్ల‌ల్ని క‌న‌డం కూడా ప్లానింగ్‌లో భాగ‌మేన‌ని గుర్తించాలంటున్నారు. 
 
పిల్ల‌లు క‌న‌డానికి అనువైన వ‌య‌సు 18 నుంచి 24 సంవ‌త్స‌రాల‌ని సూచిస్తున్న‌ారు. పెళ్ళి ఆల‌స్యం అయ్యేకొద్దీ గ‌ర్భం దాల్చే అవ‌కాశాలు త‌గ్గిపోతాయ‌ట‌. 25 సంవ‌త్స‌రాలు దాటిన త‌ర్వాత గ‌ర్భం దాల్చే అవ‌కాశం త‌క్కువ‌. అంతేకాకుండా ఒక స‌ర్వే ప్ర‌కారం 25 నుంచి 31 సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌సు గ‌ల వివాహిత‌కు గ‌ర్భం దాల్చే అవ‌కాశం 26 శాతానికి ప‌డిపోతుంది. 31 నుంచి 35 సంవ‌త్సారాల లోపు వారికి 38 శాతానికి ప‌డిపోతుంది. 18 నుంచి 24 ఏళ్ళ లోపు వివాహితుల‌కు పుట్టిన బిడ్డలు ఆరోగ్యంగా, మంచి బ‌రువుతో పుడ‌తారు. 
 
27 సంవ‌త్స‌రాలు దాటితే, బిడ్డ బ‌రువులో చాలా తేడాలుంటాయ‌ట‌. కృత్రిమ గ‌ర్భం కోసం ప్ర‌య‌త్నించేవారు ఎక్కువ మంది 35 ఏళ్ళ వ‌య‌సు దాటిన వారే ఉంటారు. పురుషుడి వ‌య‌సు పెరుగుతున్నకొద్దీ వారిలో శుక్ర‌క‌ణాల‌ ఉత్ప‌త్తి త‌గ్గిపోతుంద‌ట‌. పైగా అండ ఉత్ప‌త్తి కూడా క్షీణిస్తూ, హార్మోన్ల‌లో మార్పులు సంభ‌విస్తాయి. అండ‌కోశాలు అండాన్ని హార్మోన్ల‌ను ఉత్ప‌త్తి చేస్తుంటాయి. అండాలు ఒక్క‌ొక్క‌టి ద్రాక్ష కాయంత ప‌రిమాణంలో ఉంటాయి. సుమారుగా ఒక అంగుళం నుంచి ఒటికన్న‌ర అంగుళం పొడ‌వు, వెడ‌ల్పు క‌లిగి ఉంటుంది. 
 
గ‌ర్భ సంచి మూడు అంగుళాల పొడ‌వు, రెండు అంగుళాల వెడ‌ల్పు ఉంటుంది. ఇది కండ‌రాల‌తో నిర్మిత‌మై ఉంటుంది. దీనిపై పొర‌ను మ‌యోమెట్రియం అంటారు. గ‌ర్భాశ‌యం లోప‌ల ప్ర‌త్యేక‌మైన పొర ఉంటుంది. దీన్ని ఎండోమెట్రియం అంటారు. గ‌ర్భం క‌లిగితే, గ‌ర్భ‌స్థ పిండం ఫెలోపియ‌న్ నాళం గుండా  ప్ర‌యాణించి ఎండోమెట్రియంలో నాట‌ుకుంటుంది. అక్క‌డి ఆహారాన్ని తీసుకుంటూ గ‌ర్భ‌స్థ పిండం తొలినాళ్ళ‌లో  పెరుగుతుంది. వ‌య‌సు పెరిగే కొద్ది గ‌ర్భ‌ధార‌ణ‌కు అనుమైన ఈ ప‌రిస్థితుల్లో మార్పు వ‌స్తుంది. అందుకే పెళ్ళికి తొంద‌ర ప‌డాల్సిందే అంటున్నారు వైద్య నిపుణులు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments