Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిత్తూరు జిల్లాలో చిల్డ్రన్స్‌ హైజీన్‌ పార్లమెంట్‌ను రెకిట్స్‌ డెటాల్‌తో కలిసి ప్రారంభించిన అపోలో ఫౌండేషన్‌ టోటల్‌ హెల్త్‌

Webdunia
గురువారం, 29 డిశెంబరు 2022 (18:05 IST)
అపోలో హాస్పిటల్స్‌ యొక్క సీఎస్‌ఆర్‌ కార్యక్రమం అపోలో ఫౌండేషన్‌ టోటల్‌ హెల్త్‌, ఒక  రోజు పాటు చిల్డ్రన్స్‌ హైజీన్‌ పార్లమెంట్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో నేడు నిర్వహించింది. అపోలో ఫౌండేషన్‌ టోటల్‌ హెల్త్‌, రెకిట్స్‌ డెటాల్‌ నడుమ సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఆరోగ్య రక్షక్‌ ప్రోగ్రామ్‌ కింద నిర్వహించారు. చిల్డ్రన్స్‌ హైజీన్‌ పార్లమెంట్‌ కార్యక్రమ నిర్వహణ ప్రధాన లక్ష్యం చిన్నారులు, ఉపాధ్యాయుల నడుమ ప్రవర్తన  పరంగా మార్పులను తీసుకురావడంతో పాటుగా పరిశుభ్రత మరియు శానిటేషన్‌ పరంగా ఉన్నత ప్రమాణాలను స్వీకరించడాన్ని ప్రోత్సహించడం. ఈ కార్యక్రమం పిల్లలను, వారి కమ్యూనిటీలలో ఆరోగ్యం మరియు పరిశుభ్రత యొక్క అంబాసిడర్‌లుగా మార్చే దిశగా నడిపించడం కూడా లక్ష్యంగా పెట్టుకుంది.
 
ఆరోగ్య రక్షక్‌ కార్యక్రమానికి స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక లక్ష్యాలున్నాయి. స్వల్పకాలిక లక్ష్యాలలో పరిశుభ్రత సంబంధిత కారణాల చేత కలిగే వ్యాధుల ప్రభావం తగ్గించడం; దీర్ఘకాలిక లక్ష్యాలలో ఆరోగ్యం- పరిశుభ్రత నడుమ సంబంధం అర్ధం చేసుకుని, వ్యక్తిగతంగా, ఇల్లు- కమ్యూనిటీ స్ధాయిలో వాటిని ఆచరించ కలిగిన సమాజం నిర్మించడం. ఈ సమాజం నీరు- పరిశుభ్రతకు ప్రాధాన్యతనందిస్తుంది.
 
మొత్తంమ్మీద 600 మంది విద్యార్ధులు, 60 మంది ఉపాధ్యాయులు 60 ప్రభుత్వ పాఠశాలల నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా నుంచి పాల్గొన్నారు. చిల్డ్రన్స్‌ హైజీన్‌ పార్లమెంట్‌లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా విద్యార్ధులు పాలుపంచుకోవడంతో పాటుగా గ్రూప్‌, సోలో సాంగ్స్‌, డ్యాన్స్‌లు కూడా చేశారు. ఈ కార్యక్రమం బహుమతులు, సర్టిఫికెట్ల ప్రధానంతో ముగిసింది. అపోలో ఫౌండేషన్‌ టోటల్‌ హెల్త్‌ను  డెటాల్‌ తో భాగస్వామ్యం చేసుకుని రెకిట్‌ యొక్క ఆరోగ్య రక్షక్‌ ప్రోగ్రామ్‌ కింద నిర్మించారు. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో 100 ప్రభుత్వ పాఠశాలలను లక్ష్యంగా చేసుకుని ప్రారంభించగా, ఇప్పుడు దానిని 500 ప్రభుత్వ పాఠశాలలకు విస్తరించనున్నారు. ఇటీవలనే , టోటల్‌ హెల్త్‌ , రెకిట్‌తో భాగస్వామ్యం చేసుకుని ఆంధ్రప్రదేశ్‌లోని అరగొండ వద్ద మొదటి హైజీన్‌ పార్క్‌ ప్రారంభించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

తలసేమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్టుకి రూ. 50 లక్షలు విరాళం ఇస్తున్నా: పవన్ కల్యాణ్

తల్లితో పక్కింటి అంకుల్ అక్రమ సంబంధం: కరెంట్ వైర్ షాకిచ్చి హత్య

Elon Musk 13th Child: నా బిడ్డకు ఎలెన్ మస్క్ తండ్రి.. మీడియా అలా చేయవద్దు

9 నెలల క్రితం 17ఏళ్ల బాలిక కిడ్నాప్- యూపీలో దొరికింది.. కానీ పెళ్లైంది.. ఎవరితో?

జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు.. క్షమాపణ చెప్పినా నో యూజ్.. చర్యలు తప్పవ్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ

డైరెక్టర్లే నన్ను కొత్తగా చూపించే ప్రయత్నం చేయాలి : బ్రహ్మానందం

సుధీర్ బాబు హీరోగా జీ స్టూడియోస్ సమర్పణలో జటాధర ప్రారంభం

యుద్దం రేపటి వెలుగు కోసం అనేది త్రికాల ట్రైలర్

మహిళా సాధికారతపై తీసిన నేనెక్కడున్నా ట్రైలర్ విడుదల చేసిన ఈటల రాజేందర్

తర్వాతి కథనం
Show comments